UTILIZE THE BY IDENTIFYING THE HUMAN AS RARE IDENTITY GRANTED BY NATURE IN THE WITNESS

My PhotoMy Photo
Mother Late P.Rangaveni
Father: Late PGKsaibaba My younger brother (Late)
P.S.Bhanu Prasad


His Majestic Highness Jagadguruvulu Maharani Sametha Maharajah Shri Shri Shri Anjani Ravishankar Pilla vaaru
in the address of Hon. Chief Justice,
Supreme court of India,
New Delhi

Image may contain: text
జేబులో పెట్టుకొన్న ఫోన్ నుండి మాటలు వింటున్నారు కంప్యూటర్ ను హేక్ చేసి, ఈమైల్స్ అన్నీ చూస్తునారు, కంప్యూటర్ ముందు కుర్చుని ఎవరి ఏమి మాట్లాడుకొంటున్నా విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు అ విధంగా బౌతికంగా మేము బలం గా ఉన్నాము మేమే తెలివైన వారము మమ్ములను ఎవరూ ఏమి చెయ్య లేరు అన్నట్లు అలోచిస్త్రున్నారు, ఇందులో వ్యక్తులు కొందరు పోలీసులు మీడియా లో ఉన్న వారు కలసి గ్రూప్ గా ఫారం అయ్యి రహస్యం కులం కోసం డబ్బు కోసం సుఖాలు కోసం, రాజకీయంగా సామాజికంగా దెబ్బ కొడుతున్నారు ఎవరి మాటలు అయిన విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు, రహస్య సేటిలైట్ కెమెరాలు ఉపయోగించుకొని మోసం చేస్తున్నారు.

Tuesday, 21 June 2016

ఆంధ్రజ్యోతి రాధాక్రిష్ణ చౌదరి నీ చెత్త వ్రాతలు మానుకో!
---------------------------------------------------------------
కాపుల జోలికి రాకండి. నీ బ్రతుకేంటో నీవేంటో తెలుగు ప్రజలందరికీ తెలుసు. మెగాస్టార్ చిరంజీవి ముద్రగడకు, కాపుల ఉద్యమానికీ సపోర్ట్ చేస్తే అందరివాడు కాకుండా పోతాడా? న్యాయం వైపు మాట్లాడటం అతని తప్పా? ఆంధ్ర రాష్ట్రంలో నేడు ఈపరిస్తితులు దాపురించడానికి టీడీపీ దాని నాయకుడు చంద్రబాబు కాదా? టీడీపీ ఎన్నికల ముందు కాపులకు అనేక వాగ్దానాలు చేసి వారి ఓట్లు దొబ్బి అధికారం పొంది వాగ్దానాలను నెరవేర్చకుండా మోసం చేశాడు చంద్రబాబు. కాపులు తమ న్యాయమైన డిమాండ్ల కోసం ఉద్యమిస్తే మిగతా ప్రజలకు దూరమై ఏకాకులవుతారా? ఈనాడు ప్రజలకు దూరమై ఏకాకులైంది ఎవరో అందరికీ తెలుసు.
రాష్ట్రంలో సంపదనంతా దోచుకుంటూ తమ దోపిడీకి అధికారం అడ్డుపెట్టుకొని వ్యవస్థను నిర్వీర్యం చేస్తుందెవరో ప్రజలంతా గమనిస్తున్నారు. కాపుల ఉద్యమంపై నిర్భంధాన్ని ప్రయోగిస్తూ మానవ హక్కులను కాలరాస్తూ చీకటి పాలన కొనసాగిస్తున్నాడు మీ చంద్రబాబు. అవినీతి కేసులు విచారణకు భయపడి కోర్టులను ఆశ్రయించి బ్రతుకు తున్నాడు. ఓటు కోట్లు కేసులో దొంగగా దొరికి పోయి హైద్రాబాద్ వదిలి పారిపోయిన నేరస్తుడు చంద్రబాబు. అన్ని కులాల వారిని, మతాల వారిని మోసం చేసి పచ్చ మీడియా రక్షణలో పాలన సాగిస్తున్న పచ్చి దగాకోరు చంద్రబాబు. పిల్లనిచ్చి, రాజకీయ బిక్ష పెట్టిన తన మామనే వెన్నుపోటు పొడిచిన నయవంచకుడు చంద్రబాబు. ఆకుట్రలో నీవూ ఒక పాత్రధారివే. సామాన్య పాత్రికేయుడవైన నీవు సంపన్న వంతుడివైంది కూడా అప్పుడే!
కాపులు మీ కమ్మవారి బస్సుల్లో డ్రైవర్లూ క్లీనర్లన్నావు. మీరెంతో ప్రతిష్టాత్మకంగా చెప్పుకొనే SRMTస్థాపించింది కాపులని మరిచి పోకు. కాపుల ఇళ్ళలో ఎందరో కమ్మవారు పాలేర్లుగా, వారి భూముల్లో వ్యవసాయ కూలీలుగా పని చేశారు తెలుసుకో. అంతెందుకు మీ రాజ గురువుగా చెప్పుకొనే రామోజీరావు తొలినాళ్ళలో ఓ కాపు భూస్వామి పండలనేని అంజయ్య గారి వద్ద గుమాస్తా తెలుసా? 50 ఏళ్ళ క్రితం మీకమ్మ కులం కాపులకంటే గొప్పగా ఏమీలేదు.
కాపు కులం బ్రతికి చెడ్డకులం. కపటం, మోసం, వంచన, కుట్రలూ, కుహకాలు తెలియని జాతి కాపుజాతి. మారుతున్న సమాజానికి అనుగుణంగా మార్పు చెందక పోవడం కాపుజాతిని పేదరికానికి గురిచేసి వెనుకబాటు తనానికి గురిచేసింది.
కమ్మవారు ఎలా ధనికులయ్యారో ప్రపంచానికంతా తెలుసు. మీకులం మీరకున్నట్లు తెలివితేటలున్నవారు కారు కాకపోతే మానిప్లేటర్లు. కాపులకేమో అది చేతకాదు. మీ కులం గురించి దలేర్ బింబా బాలీ అనే విదేశీ మహిళ రీసెర్చి చేసి మీరెలా ధనవంతులయ్యారో సోదాహరణంగా వివరించింది ఆవీడియోలు ఓసారి చూసుకోండి.
తుని ఘటనల్లో రైలూ, పోలీసు స్టేషన్ ఎవరో దుండగులు తగల పెట్టారు. ఆ ఘటనలు కాపులకు సంబంధం లేదని స్వయానా మీ సీఎం చంద్రబాబు కొద్ది గంటల్లోనే మీడియా ముందు శెలవిచ్చారు. అవి చేసిన వారెవరో తనకి సమాచారం ఉందని కూడా అన్నారు. మరిప్పుడు కాపులే చేశారని కేసులు బనాయించడం వెనుక ఎటువంటి కుట్రదాగుందో అర్థమౌతుంది.
ఈదేశంలో ఎన్ని ఉద్యమాల్లో ఎన్ని వందల రైళ్ళు ఎన్ని వేల బస్సులు తగలబడి పోయాయి పరిటాల రవి హత్య సందర్భంగా ఎన్ని వందల బస్సులు, ఎన్ని ప్రభుత్వ ఆస్తులు ధ్వంస మయ్యాయి. వీటికి మీకులం కారణం కాదా? వారిపై ఏం కేసులు పెట్టారు, ఎందర్ని జైలుకి పంపారు?
చిరంజీవి గారు, దాసరి గారూ కులం మీటింగుకి హాజరవడం నేరంగా చెబుతున్నారు. మీరు తానా పేరిట అమెరికాలో కులం సభలు జరుపు కోవచ్చు, కమ్మ సంఘాల మీటింగులకు మీ ఎం ఎల్ ఏ లు మంతృలూ వెళ్ళవచ్చు, మీ పురంధేశ్వరి కమ్మ మీటింగుకి వెళ్ళి కమ్మ కులంలో పుట్టినందుకు నేనెంతో గర్వపడుతున్నాను అంటూ ఉపన్యాసాలిచ్చినా మీకు తప్పుగా కనపడదు. నేడు ప్రభుత్వ కార్యక్రమాలన్నిటినీ కమ్మ మయం చేస్తున్నా ఉదాహరణకు తెలుగు మహా సభలు, లేపాక్షి ఉత్సవాలూ, రాజధాని ప్రారంభోత్సవాలూ వేదిక లన్నిటినీ కమ్మ మయం చేస్తూంటే తప్పుకాదు కానీ కళ్ళెదుట తమ జాతివారికి తీరని అన్యాయం జరుగుతుంటే స్పందించి ప్రభుత్వ తీరుని ఖండిస్తే తప్పు పడతారా?
పైగా చిరంజీవి గారి కుటుంబాన్ని వారి పిల్లల పెళ్ళి విషయాల ప్రస్తావన, సినిమా హీరోల భవిష్యత్ ను బ్లాక్ మెయిల్ చేసే రీతిన నీవ్రాతలు ప్రజలు పసికట్టకపోరు. నీ వ్రాతలే చిరంజీవి, దాసరిల కలయిక మిమ్మల్నెంత భయ భ్రాంతులకు గురిచేశాయో అర్ధమౌతుంది. చిరంజీవి గారేంటో అతని వ్యక్తిత్వం ఏమిటో ప్రజలందరికీ తెలుసు. రాజకీయాల్లో జయాపజయాలు సహజం. అపజయం చెందినంత మాత్రాన అతడు ప్రజాజీవితం నుండి పారిపోలేదు. అతడు ప్రజలతోనే అందరివాడుగా ఉన్నాడు, ఉంటాడు. కోటిన్నర మంది కాపులు కూడా ప్రజలలో భాగమే!
రాధాకృష్ణా దాసరి గారి గురించి వ్రాస్తూ బొగ్గు స్కామ్ విషయం ఎత్తావ్! అలాగే చంద్రబాబుని గురించి వ్రాసేప్పుడు ఓటు-నోటు స్కాం గురించి కూడా వ్రాసి నీ నిజాయితీ నిరూపించుకో!
తెలంగాణ మంతృలు, ఎం ఎల్ ఏ లను అవహేళన
చేస్తూ మీఛానళ్ళలో అనుచిత మైన ప్రసారాలు చేస్తే మీ ABN ఛానల్ను TV-9 ఛానల్ని తెలంగాణలో నిషేధించారు. దానికి మీరు తప్పు మీవైపు వున్నా ప్రచారసాధనాల గొంతు నొక్కేశారనీ, ప్రజాస్వామ్యం ఖూనీ చేయబడిందనీ గగ్గోలు పెట్టారు. మరి నేడు ఆంధ్ర రాష్ట్రంలో కోటిన్నర ప్రజలు తమ హక్కులకై పోరాడుతుంటే ఆ వార్తలు ప్రసారం చేయకుండా కమ్మ ఛానళ్ళు స్వచ్ఛందంగా కాపులపై కుట్ర చేస్తే దీనినేమనాలి. కాపు కులంపై కమ్మ వారి దాష్టీకంగా భావిస్తాం. కాపుల వార్తలు ప్రసారం చేసే ఛానళ్ళను సాక్షి, నెం.1 ఛానళ్ళను MSOల ద్వారా ప్రసారం కాకుండా నిలిపి వేయడం ఏరకమైన చర్య సమాధానం చెప్పగలవా?
కమ్యూనిస్టు భావజాలం ఉన్నట్లుగా, కుల వ్యతిరేకిగా నీకు నీవు ప్రచారం చేసుకోవడం కాదు. దమ్ముంటే నీపుట్టుకలో నిజాయితీ వుంటే పై ప్రశ్నలకి సమాధానాలు చెప్పాలి. లేకుంటే గోబెల్స్ కి చరిత్రలో ఏస్తానం దక్కిందో మీ కమ్మ మీడియాకీ అదే గతి పడుతుంది.
-కఠారి అప్పారావు
కాపునాడు

No comments:

Post a Comment