పూర్వం అక్బర్ ఆస్థానంలో ఉన్న తాన్ సేన్, వర్షం కురిపించడానికి 'మేఘమల్హార్' రాగం పాడి విజయం సాధించాడనేది అందరూ నమ్మే ఓ కథ.
సంగీతసామ్రాట్టుగా ప్రసిద్ధిపొందిన ముత్తుస్వామి దీక్షితార్ కూడా తిరునల్వేలి జిల్లాలో తన 'అమృతవర్షిణి' రాగాలాపనతో వర్షం కురిపించాడని సాక్ష్యాలున్నాయి.
అయితే 1982 లో వర్షాలుపడక మద్రాసు రాష్ట్రమంతా తాగే నీళ్లు లేక ఇబ్బందిపడే పరిస్థితి వచ్చినప్పుడు ప్రముఖ వయొలిన్ విద్వాంసుడు కె.వైద్యనాథన్ వర్షం కురిపించిన సంఘటన చరిత్ర సృష్టించింది. "మీ సంగీత ప్రతిభతో ప్రజలమేలు కోరి వర్షం కురిపించండి" అంటూ రాష్ట్రప్రభుత్వం ఆయనను కోరింది.
వైద్యనాథన్, రెడ్ హిల్స్ సరస్సులో నిలబడి పదిహేనురోజుల పాటు వివిధ సంగీత రాగాలను వయొలిన్ మీద ఆలపించి, మొదటిరోజే ఆకాశంలో మబ్బులు వచ్చేట్టు చేశాడు. అదే పట్టుదలతో ఆయన కృషి చేయగా తొమ్మిదోరోజు కుండపోతగా వర్షం కురిసింది. ఆయన వర్షం కురిపించడానికి ఆలపించిన రాగాలు- మొదట 'అమృతవర్షిణి' , మేఘరంజని తరువాత వరుణప్రియ అనేవి.
ఇప్పటికాలంలో ఇంత గొప్ప సంగీత కళాకారులుండటం నిజంగా ప్రపంచమే గర్వించదగ్గ విషయం.
(జూన్ 21 - "వరల్డ్ మ్యూజిక్ డే" సందర్భంగా- ఓ మంచిపుస్తకం నుండి- సేకరణ:డమాముల గాయత్రి)
(జూన్ 21 - "వరల్డ్ మ్యూజిక్ డే" సందర్భంగా- ఓ మంచిపుస్తకం నుండి- సేకరణ:డమాముల గాయత్రి)
No comments:
Post a Comment