ముద్రగడ మాకు దేవుడు : పల్లా శ్రీహరి
కాపు, SC , BC ల అక్రమ అరెస్ట్ లకు నిరసనగా ఆమరణ దీక్ష చేస్తున్న ముద్రగడ పద్మనాభం గారి దీక్ష 11వ రోజుకు చేరింది.
దళిత సామాజిక వర్గానికి చెందిన పల్లా శ్రీహరి కారు డ్రైవర్. తుని మీటింగ్ కి వెళ్ళిన కాపులకు కారు డ్రైవర్ గా వెళ్ళాడు. “తుని రైల్వే ఘటన ” లో శ్రీహరి పాత్ర ఉంది అని పోలీసులు అరెస్ట్ చేసారు. తల్లిదండ్రులకు కుడా సమాచారం ఇవ్వ లేదు అని అతని తండ్రి వాపోయారు .బెయిల్ పెట్టుకోవటం కుడా తెలియదని, ముద్రగడ పద్మనాభం గారు తన కుటుంబ ప్రాణాలకు తెగించిఆమరణ దీక్ష చేయక పొతే తమ కుమారుడు విడుదల అయ్యే వాడు కాదని భోరున విలపించాడు .
ఈ కేసులో రజక సామాజిక వర్గానికి చెందిన మరొక వ్యక్తి కుడా విడుదల అయిన వారిలో ఉన్నారు.
తుని ఘటన ఎవరు చేసారో తెలియదు. ఈ కేసుని అడ్డు పెట్టుకొని ఒక సామాజిక వర్గం వారు పోలీసులు, మీడియా సహాయంతో SC ,BC , కాపులను అక్రమ కేసులలో అరెస్ట్ చేయించి వారిని రాజ్యాధికారానికి దూరం చేయాలని కుయుక్తులు పన్నుతున్నారని రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం .
తమకు అనుకూలంగా లేని మీడియా ని ఆపేయటం , తన వర్గం మీడియా తో అసత్య ప్రచారాలు చేయిస్తున్నారని దళిత , బహుజన, కాపు వర్గాలు అభిప్రాయ పడుతున్నాయి. కారంచేడు , చుండూరు ఘటనలను గుర్తు చేసుకుంటున్నారు . ఆ రోజులు మారాయని పోలీసుల కేసులతో , మీడియాతో బెదిరించలెరని ఆయా వర్గాల యువత పేర్కొంటున్నారు.
అక్రమ కేసులలో SC , BC , కాపు సామాజిక వర్గానికి అమాయకులను ఇరికిస్తే స్పందించని MLA బాలకృష్ణ సినిమాలను చూడటం మానేయాలని పిలుపు ఇచ్చారు.
రాజ్యంగా సంస్దలు ఈ అణిచివెతలపై మౌనంగా ఉండటం ప్రజాస్వామ్యానికి మంచిది కాదని ప్రజలు భావిస్తున్నారు ..
No comments:
Post a Comment