దలైలామా ఎన్నో డిగ్రీలు అందుకున్నారు మంత్రి కేటీఆర్
ప్రపంచంలోని ఎన్నో యూనివర్సిటీల నుంచి దలైలామా ఎన్నో డిగ్రీలు తీసుకున్నారని మంత్రి కేటీఆర్ తెలిపారు. బౌద్ధ ఆధ్యాత్మిక గురువు దలైలామా హైదరాబాద్ పర్యటనలో భాగంగా సెంటర్ ఫర్ ఎథిక్స్ భవనానికి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమానికి హాజరైన కేటీఆర్ మాట్లాడుతూ ప్రపంచంలోనే ఎంతోమందిని ప్రభావితం చేసిన వ్యక్తి దలైలామా అన్నారు. 1989లోనే ఆయనకు నోబెల్ శాంతి బహుమతి వచ్చిందని పేర్కొన్నారు. దలైలామా సెంటర్ ఫర్ ఎథిక్స్ భవనానికి రూ.5కోట్లు మంజూరు చేశారని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ నరసింహన్తోపాటు డిప్యూటీ సీఎం మహమూద్ అలీ పాల్గొన్నారు.
No comments:
Post a Comment