Vasudeva Rao Kadagala toC.V.Anand, IPS
Venkateswarlu , Sub Inspector of Police, Andhra Pradesh, 2004 batch.
గమనిక: ఎస్సై వెంకటేశ్వర్లు ధీనగాథ సీఎం చంద్రబాబుకి చేర్చండి..
సబ్ ఇన్ స్పెక్టర్ గా జాయిన్ అయ్యి..తనకంటూ ఓ ప్రత్యేకతను చాటుకున్నాడు. స్వంచ్ఛంద సంస్థల కార్యక్రమాల్లో పాలుపంచుకున్నాడు. నలుగురికి మంచి చేయాలన్న తన బావాలను పంచాడు. ఇలా మొదలైన సబ్ ఇన్ స్పెక్టర్ జీవితంలో అంతా ఆనందమే కానీ కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. జీవితం ఎప్పుడూ ఒడికులు సహజం. ఎత్తుపల్లాలు కామన్. ఆ ఎస్సై జీవితం కూడా ఊహించని మలుపుతిరిగింది. తన ఆశలన్నీ నాలుగేళ్లలో అడిఆశలయ్యాయి. విధి నిర్వహణలో జరిగిన ఘోరంతో మృత్యు అంచున వెళ్లి పునర్జన్మ పొందిన ఆ ఎస్సై ఇప్పుడు దుర్భుర పరిస్థితుల్లో ఉన్నాడు. దాదాపూ 8ఏళ్లుగా అత్తారింట్లో కడుపు నింపుకుంటున్నాడు. తానెక్కడున్నాడో కూడా తనకు తెలియదు. పసిపిల్లాడిలా మారిపోయాడు. ఇదికథ కాదు.రియల్ స్టోరీ.
బ్యాచ్ నెంబర్ 2004 తూర్పుగోదావరి జిల్లా కోరుకొండకు చెందిన వెంకటేశ్వర్లు ఆంధ్రప్రదేశ్ సబ్ సబ్ ఇన్పెక్టర్ గా ఎంపికయ్యాడు. ఇది ఎంతో దీక్ష దక్షతా ఉంటేనే సాధ్యం. తన కలను నెరవేర్చుకున్నాడు. సాధ్యం కానిదంటూ ఏం లేదంటూ సుసాధ్యం చేసుకున్నాడు వెంకటేశ్వర్లు. బాల్యంలో పోలీస్ డిపార్ట్ మెంట్ పై ఎంతో మక్కువ పెంచుకున్న వెంకటేశ్వర్లు..పోలీస్ కావాలన్న దృఢ సంకల్పాన్ని ఏర్పరుచుకున్నాడు. అందుకు కష్ట పడ్డాడు. చదివాడు. సాధ్యం కానిది ఏదీ లేదని 2004 లో నిరూపించాడు. జగ్గయ్య పేటలో ప్రొబెషనరీ ఇన్ స్పెక్టర్ గా డ్యూటీలో చేరిన వెంకటేశ్వర్లు ఆ తరువాత నందిగామ, ఏలూరులో ఎస్సైగా పనిచేశాడు. ఎలాంటి అలమరికలు లేని ఆయన జీవితంలో అన్నీ సంతోషాలే. బ్యాచిలర్ గా ఉన్న ఎస్సై జీవితంలోకి భాగస్వామిగా వచ్చింది వీరలక్ష్మీ. వీరలక్ష్మీ- వెంకటేశ్వర్లు వైవాహిక బంధంలో అన్యోన్యత, ప్రేమానురాగాలకు గుర్తుగా వారి జీవితంలోకి మరొకరు రాబోతున్నారు. వీరలక్ష్మీ తల్లి కాబోతుంది. ఆ దంపతుల్లో ఎంతో సంతోషం. ఎంతో ఆనందం...
మైలవరం నుంచి అవని గడ్డకు బదిలీ అయిన వెంకటేశ్వర్లు ఆ కొత్త ప్రాంతాన్ని అలవాటు చేసుకోవడం మొదలు పెట్టాడు.ఆనందంగా ఉంటున్న ఆ దంపతులను చూసి విధికి కన్నుకుట్టిందేమో. సెప్టెంబర్ 8,2008న డ్యూటీ చేసి రాత్రి బైక్ పై వెళుతున్న ఎస్సై వెంకటేశ్వర్లును గుర్తు తెలియని వాహనం అదుపుతప్పి ఢీ కొట్టింది.
అంతే వెంకటేశ్వర్లు జీవితంలో ఊహించని పరిణామం.కలలో కూడా ఆ దారుణం జరుగుతుందని ఊహించలేదు. ఆ రోజు వివిధ ప్రాంతాల్లో గస్తీకి వెళ్లాల్సిన ఎస్సై ప్రతి ప్రాంతాన్ని క్షుణ్ణంగా పరిశీలించేదుకు బైక్ పై వెళ్లాడు. కానీ ఆరాత్రే అతని జీవితంలో ఊహించని మలుపవుతుందని అనుకోలేదు. సంతోషమే చిరునామాగా ఉన్న వెంకటేశ్వర్ల జీవితంలో ప్రమాదం విషాదాన్ని నింపింది. తీవ్రగాయాలతో రక్తస్రావంతో తడిసిపోయి ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న వెంకటేశ్వర్లను విజయవాడలోని పెద్దాసుపత్రికి తరలించారు. వెంకటేశ్వర్లకు ప్రతిరూపం వీరలక్ష్మీ గర్భంలో పసిబిడ్డ రూపంలో ప్రాణం పోసుకుంటుంది. అటు చూస్తే వెంకటేశ్వర్లు ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నాడు. అంతా విషాదం.
ప్రాణాలతో కొట్టు మిట్టాడుతూ మృత్యు అంచున వెళ్లిన వెంకటేశ్వర్లు వైద్యుల శ్రమఫలితం పునర్జన్మ పొందాడు. కానీ పూర్తిగా నయం కాలేదు. ఇదీ సబ్ ఇన్పెక్టర్ వెంకటేశ్వర్ల పరిస్థితి. అన్నీ ప్రయత్నాలు చేసి ప్రాణాలు కాపాడారేమో కానీ మామూలు మనిషిని చేసేందుకు అవకాశం లేకుండా పోయింది.
విధి ఆడిన వింతనాటకంలో తాను బ్రతికున్నా జీవత్ఛవంలా మారిపోయాడు. కదల్లేడు, మెదల్లేడు, కట్టుకున్న భార్యను, కన్నకూతుర్ని తప్ప వేరెవరినీ గుర్తించలేడు. ఇప్పుడు ఆయన స్థితి ఇది. అయ్యో అన్నవారులేరు. ఆదుకున్న హస్తము లేదు. అర్థాకలితో అలమటిస్తున్న ఆ కుటుంబానికి దిక్కెవరూ లేరు. ఒకప్పుడు హాయిగా బ్రతికిన ఈ చిన్ని కుటుంబం. ఇప్పుడు ఎన్నో కష్టాలను అనుభవిస్తుంది. సొంతంగా నడవలేడు. మాట్లాడలేడు. ఎవర్నీ గుర్తుపట్టలేడు. ఓ చిన్న పిల్లాడిలా మారిన సబ్ ఇన్ స్పెక్టర్ వెంకటేశ్వర్లు అందమైన జీవితంలో ఎనిమిదేళ్లు కాల గర్భంలో కలిసిపోయాయి.
విధి ఆడిన వింతనాటకంలో తాను బ్రతికున్నా జీవత్ఛవంలా మారిపోయాడు. కదల్లేడు, మెదల్లేడు, కట్టుకున్న భార్యను, కన్నకూతుర్ని తప్ప వేరెవరినీ గుర్తించలేడు. ఇప్పుడు ఆయన స్థితి ఇది. అయ్యో అన్నవారులేరు. ఆదుకున్న హస్తము లేదు. అర్థాకలితో అలమటిస్తున్న ఆ కుటుంబానికి దిక్కెవరూ లేరు. ఒకప్పుడు హాయిగా బ్రతికిన ఈ చిన్ని కుటుంబం. ఇప్పుడు ఎన్నో కష్టాలను అనుభవిస్తుంది. సొంతంగా నడవలేడు. మాట్లాడలేడు. ఎవర్నీ గుర్తుపట్టలేడు. ఓ చిన్న పిల్లాడిలా మారిన సబ్ ఇన్ స్పెక్టర్ వెంకటేశ్వర్లు అందమైన జీవితంలో ఎనిమిదేళ్లు కాల గర్భంలో కలిసిపోయాయి.
వెంకటేశ్వర్లు కనీసం తనకు రక్తం పంచుకొని పుట్టిన కూతుర్ని ముద్దాడలేడు. ప్రమాదంతో జ్ణాపకశక్తి కోల్పోయిన వెంకటేశ్వర్లు కూతుర్ని గుర్తించగలడు. భార్య కన్నీరు పెడితే సహించలేడు. వద్దంటూ వారిస్తుంటాడు. తాను పోలీస్ నని, సబ్ ఇన్ స్పెక్టర్ ననే విషయాన్ని మాత్రమే గుర్తు పెట్టుకుంటాడు.
దుర్భుర జీవితాన్ని అనుభవిస్తున్న వెంకటేశ్వర్ల కుటుంబానికి దిక్కులేకుండా పోయింది. అత్తారింట్లో ఉంటున్నాడు. కుటుంబం పడుతున్న కష్టాలు చూడలేక వీరలక్ష్మీ అప్పుడప్పుడు పనికెళుతుండటం కంటతడిపెట్టిస్తుంది.
ఓ కాకి చనిపోతే వందకాకులు అక్కడికి చేరుతాయి. కానీ మన ఖాకీల పరిస్థితి అంతకన్నా ఘోరంగా ఉందని సబ్ ఇన్ స్పెక్టర్ జీవితం చెప్పకనే చెబుతుంది. డ్యూటీలో ఉన్నన్నాళ్లు వాడేసుకున్నాళ్లంతా. ఇప్పుడు ఎమయ్యారు. మానవత్వాన్ని కూడా చాటలేరా. కనీసం ప్రభుత్వం నుంచి సహాయం అందదా. దీనికి ఎవరు బాధ్యులు. ఓ సబ్ ఇన్సెక్టర్ ను పట్టించుకోని నాయకులు. సామాన్యుల్ని ఏం పట్టించుకుంటారు. ఆ కన్నీటి కుంటుబానికి సమాధానం చెప్పేదెవరు.
ప్రమాదంలో గాయపడి జీవశ్చవంలా మారిన వెంకటేశ్వర్లకు భార్య, కుమార్తె ఉంది. ప్రమాదం జరిగాక ఆరునెలలు జీతం అందింది. ఆ తరువాతే ఆగిపోయింది. రోడ్డు ప్రమాదానికి సంబంధించి ప్రభుత్వం నుంచి ఎటువంటి సాయం అందలేదు.
ప్రమాదంలో గాయపడి జీవశ్చవంలా మారిన వెంకటేశ్వర్లకు భార్య, కుమార్తె ఉంది. ప్రమాదం జరిగాక ఆరునెలలు జీతం అందింది. ఆ తరువాతే ఆగిపోయింది. రోడ్డు ప్రమాదానికి సంబంధించి ప్రభుత్వం నుంచి ఎటువంటి సాయం అందలేదు.
వెంకటేశ్వర్లు మూడెకరాల భూమి ఉండేది. ప్రమాదంలో గాయపడి మూడు నెలలు కోమాలో ఉన్న వెంకటేశ్వర్లకు లక్షలు ఖర్చయ్యాయి. ఈ క్రమంలో ఉన్న భూమి పోయింది. ఆ ఇల్లాలు ఒంటిపై ఉన్న నగలు కరిగిపోయాయి. మందులతోనే కొన్నాళ్లు బ్రతికిన వెంకటేశ్వర్లు ఆ తరువాత నాలుగు మెతుకులు తినగలుగుతున్నారు. జ్ణాపక శక్తిని కోల్పోయి పసిపిల్లాడైనా వెంకటేశ్వర్లు కథ తెలుసుకొన్న ఎస్పీ రవిప్రకాష్ మీటింగ్ సమయంలో ఆ కుటుంబాన్ని పిలిపించి పరిచయం చేశాడు. అప్పటి వరకు తెలిసిన వాళ్లు కూడా గుర్తించకుండా లేకుండా ఉండటం చూసి చలించిపోయారు. చేయి చేయి కలిపారు. తోటి బ్యాచ్ మెట్స్ ముందుపడ్డారు. ఎస్పీ చూపిన దారిలోనే అందరూ ముందుకు కదిలారు. ఇలా పోగుచేసిన 4లక్షల రూపాయల్ని వెంకటేశ్వర్లు కూతరు పేరు మీద ఫిక్స్ డ్ డిపాజిట్ చేశారు. వెంకటేశ్వర్ల పరిస్థితి చూసి చలించిపోయిన కాకినాడ రెవెన్యూ విభాగం 25వేల రూపాయల్ని ఆయన భార్య వీరలక్ష్మికి అందజేసి తమ దాతృత్వాన్ని చాటుకున్నారు. ఒక పోలిస్ గా తన విధుల్ని నిర్వహించి చివరకు ఇలాంటి ధీనస్థితిలో పడిపోయిన వెంకటేశ్వర్ల కుటుంబాన్ని ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సమాజ శ్రేయస్సుకోసం నిత్యం శ్రమించే పోలీసులకు ఇలాంటి పరిస్థితి ఎదురైతే దారుణమే.
చాలా ఏళ్ల తరువాత వెంకటేశ్వర్ల దుర్భర పరిస్థితి వెలుగులోకి వచ్చింది. ఆయన జీవితంలో వెలుగులు నింపేందుకు సాయం చేయడానికి ఒక్కో చేయి ముందకు వచ్చాయి కానీ ప్రభుత్వం నుంచి స్పందన లేదు. ఇంతకాలం ఏం చేసినట్లు. డిపార్ట్ మెంట్ లో పనిచేసిన వెంకటేశ్వర్లకు ప్రభుత్వ సాయం ఎందుకు అందలేదు. జీతం ఆపినప్పుడైనా ఆలోచించ లేకపోయారా. సాక్షాత్తూ హోంమినిస్టర్ చినరాజప్ప..వెంకటేశ్వర్లను చూసి చలించినా స్పందన ఏది. చాలా ఏళ్ల తరువాత కదిలిన యంత్రాంగం వెంకటేశ్వర్ల పరిస్థితిని ఆలస్యంగా గుర్తించింది. అదే సమయంలో కాకినాడ వచ్చిన హోంమంత్రి చినరాజప్పను కలిసి విషయాన్ని వివరించారు. ఎలాంటి సాయం అందలేదని తెలుసుకొని వారిని చూసి హోంమంత్రి చినరాజప్ప చలించిపోయారు. ఆ కుటుంబాన్ని ఆదుకుంటామని భరోసా మాత్రమే ఇచ్చారు. హోంమంత్రి నుంచి సమాచారం అందినట్లుగా తెలుస్తోంది. కానీ ఫైళ్లు కదల్లేదని తెలుస్తోంది. ఇప్పటి వరకు ఆ కుటుంబాన్ని కలిసినవారు లేరు. ఎంక్వైరీ చేసినవారు లేరు. వెంకటేశ్వర్లు బ్యాచ్ మెట్స్ ఇప్పుడు పదోన్నతులు పొందారు కూడా. కానీ ఇతనికి ఎలాంటి భరోసా లేకుండా పోయింది. ఇన్నేళ్లు గడిచినా ప్రభుత్వ కుటుంబాన్ని ప్రభుత్వం పట్టించుకోలేదంటే ఇక సామాన్యుల పరిస్థితి ఏంటని ప్రతీ ఒక్కరూ ప్రశ్నిస్తున్నారు. ఈ కుటుంబాన్ని ఏపీ ప్రభుత్వం, సీఎం చంద్రబాబు నాయుడు గుర్తించాలి. వారికి అందాల్సిన సాయం చేయాలి. ఈ బాధ్యత ప్రభుత్వానిదే. పాలకులదే.
గమనిక: ఎస్సై ధీనగాథ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడికి చేరే వరకు షేర్ చేయండి.
గమనిక: ఎస్సై ధీనగాథ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడికి చేరే వరకు షేర్ చేయండి.
No comments:
Post a Comment