యువతకు బంగారు భవిష్యత్తు అందించే అనేక రకాల నైపుణ్య శిక్షణా కార్యక్రమాలను తెలంగాణాలో హైదరాబాద్ దగ్గరలోని ముచ్చింతల్ లోని స్వర్ణభారత్ ట్రస్టులో ప్రారంభించడం సంతోషంగా ఉంది.
హైదరాబాద్ దగ్గరలో పలు జిల్లాలకు దగ్గరగా చక్కని వాతావరణంలో ఉచితంగా అందిస్తున్న నైపుణ్య శిక్షణను సమీప ప్రాంతాలలోని ప్రజలు వినియోగించుకోవాలి
కేంద్ర నైపుణ్య శిక్షణ శాఖ సహాయమంత్రి శ్రీ రాజీవ్ ప్రతాప్ రూడీ గారితో కల్సి టూ వీలర్, ఫొర్ వీలర్ మెకానిజం, ఎలక్ట్రిషియన్, ప్లంబింగ్, ఎసి, రిఫ్రిజిరేటర్ మెకానిజం,కంప్యూటర్ శిక్షణ,ఫార్మా రంగాలలో శిక్షణ తరగతులు లాంఛనంగా ప్రారంభించడం ఆనందాన్ని కలిగించింది.
ఉచిత వసతి, భోజన సదుపాయంతో పాటు నాణ్యమైన శిక్షణ అందించేందుకు స్వర్ణభారత్ ట్రస్టు, హైదరాబాద్ విభాగం (ముచ్చింతల్) సకల సౌకర్యాలను కల్పించింది.
No comments:
Post a Comment