సమ సమాజ స్థాపనకోసం ... పాజిటివ్ నియంత్రుత్వం తప్పదు.
ప్రాటిటేరియట్ డిక్టేటర్ షిప్..వో అనివార్య ప్రక్రియ అని సిద్దాంతీకరించిన కారల్ మార్క్స్ మహానుభావుడు :
చరిత్రను వో పాలి పరిశీలిస్తే కొంత ఆశ్చర్యకరమే అయినా సైంటిఫిక్ అప్రోచ్ తో కూడిన నిర్ణయాలు సిద్దాంతాలు కనిపిస్తాయి. అవి సర్వకాల సర్వావస్తలయందు నిరూపణతో నిలుస్తయి. అట్లా అన్పించే వొక సిద్దాంతమే...ప్రాలిటేరియట్ డిక్టేటర్ షిప్..అంటే కార్మిక వర్గ నియంత్రుత్వం.
పీడిత వర్గాలకోసం తన జీవితాన్ని త్యాగం చేసి, ప్రపంచ చరిత్ర గతినే మలుపు తిప్పిన మహానుభావుడు కారల్ మార్క్స్.ఈ సిద్దాంతాన్ని ప్రతిపాదించిండు.
విప్లవ పోరాటాన్ని విజయవంతం చేయడం ద్వారా కార్మిక వర్గం అధికారం లోకి వస్తది.. అప్పుడు ఈ కార్మికవర్గ ప్రభుత్వం కొంత నియంత్రుత్వంగానే కొద్దిరోజుల పాటు పాలనను కొనసాగించాలంటడు మార్క్స్.
అదేంటిది.. సమ సమాజం కోసం పోరాడి త్యాగాలు చేసిన కార్మికుడు తాను అధికారంలోకి వచ్చినప్పుడు అత్యంత ప్రజాస్వామికంగా వ్యవహరించాలె కదా.. నియంత్రుత్వంగా వ్యవహరించడం ఏమిటి.. అనే డౌటు మనకు రావచ్చు.
దీనికి సంబంధించి అదే మార్క్స్ యేమంటడు అంటే..
అత్యంత ప్రజాస్వామికంగా వుండే రాజ్య స్తాపన జరుగాలంటే.. మానవులంతా సమానంగా వుండే సమ సమాజ స్తాపనను దీర్ఘకాలికంగా కొనసాగించాలంటే..కార్మిక వర్గం నియంత్రుత్వం కొన్నేండ్లపాటు తప్పదని నొక్కి చెపుతాడు. అట్లా ఎందుకు వ్యవహరించాలో అందుకు కారణాలు వివరిస్తడు..కారల్ మార్క్స్.
నూతన ప్రజా స్వామిక విప్లవం విజయవంతం కాగానే పరిపాలనలోకి వచ్చిన కార్మిక వర్గ ప్రభుత్వానికి గత పాలకులు వదిలిపెట్టి పోయిన అవలక్షణాల కంపు వెంటాడుతుంది. దాంతో అవలక్షణాలతో కూడిన పాలక విలువలు నూతన ప్రభుత్వానికి సమస్యగా మారుతయి. గత పాలనకు సంబంధించిన దుర్మార్గపు విలువలను అసమానతలఃతో కూడిన అవకాశవాద విలువలను రూపు మాపందే..కార్మిక వర్గ ప్రభుత్వం తన నూతన ప్రజా స్వామిక విలువలను ఎస్టాబ్లిష్ చేయడం కష్టం. కాబట్టి వీటిని రూపుమాపేందుకు ఈ పాజిటివ్ నియంత్రుత్వం అవసరం అంటడు మార్క్స్.
సమాజానికి అంటుకున్న పాత విలువలు అంత తొందరగా వదిలిపోవు. అలువాటు ప్రకారం అవే మూస పద్దతులు అన్ని రంగాలను తిరిగి బ్రష్టు పట్టించే అవకాశం వుంటది. అటువంటప్పడు అందుకు సంబంధించిన అలవాట్లను ఆలోచనలు కూడా మార్చాలె,.అట్లా మార్చందే కమ్యూనిస్టు వ్యవస్ధ స్థాపన కుదురదు అంటారు మార్క్స్. అందుకోసం కార్మిక వర్గ ప్రభుత్వం సొంత ప్రజల తోనయినా కఠినంగా వ్యవహరించి వారి ఆలోచనా ద్రుక్పదాన్ని మార్చాల్సిందే అని సిద్దాంతీకరిస్తడు.
వొక తండ్రి తన బిడ్డ బాగుండాలంటే ఆ బిడ్డ కోరిన కోరికనల్లా తీర్చే ప్రయత్నం చేయడు..అందులో తన బిడ్డ కు ఉపయోగపడే అంశమేందో విజ్నతతో పరిశీలించి తదుపరి నిర్ణయం తీసుకుంటడు. అంటే తన బిడ్డ యేమికోరిందో కాదు, ఆబిడ్డకేది అవసరమని భావిస్తాడో దాన్ని సమకూరుస్తడు.. అయితే..తన స్వేచ్చా స్వాతంత్ర్యాలను తన తండ్రి హరిస్తున్నడని ఇక్కడ ఆ బిడ్డ అనుకోవచ్చు...కని ఆ తండ్రి కంటే మిన్నగా ఎవరూ ఆ బిడ్డ క్షేమం కోరుకోరు అనేది మనకు తెలుసు.
ఇట్లాంటి అనేక సందర్భాలు చరిత్రలో మనం చూడవచ్చు. తమ స్వార్ద ప్రయోజనాలకోసం పనిచేసే ప్రభుత్వానికి వుండే నియంత్రుత్వ ధోరణులకు ప్రజా సంక్షేమం కోసం పాటుపడే ప్రజా ప్రభుత్వాల పాజిటివ్ నియంత్రుత్వం ధోరణులకు వుండే తేడాను మనం ఇక్కడ విజ్నతతో పరిశీలించాలె.
కొన్ని డిమాండ్లతో తియాన్మెన్ స్క్వేర్ వద్ద ధర్నా చేస్తున్న తన దేశ పౌరులను అనేక వార్నింగుల తర్వాత చైనా దారుణంగా అణచివేసింది. బుల్డోజర్లతో తొక్కించి అత్యంత కిరాతకంగా వ్యవహరించి వేలాది మందిని చంపేసింది కూడా. అప్పడు ప్రపంచ వ్యాప్తంగా చైనా అప్రజాస్వామ్యంగా వ్యవహరిస్తుందనే నిరసనలు వెల్లువెత్తాయి. అయినా చైనా ప్రభుత్వం ఏమాత్రం భయపడలేదు. దేశాన్ని మరింతగా అభివ్రుద్ది చేసేందుకు తమకంటూ వొక పాలసీ వున్నదని..ఎవరేమన్నా తమ విధానాలను అమలు పరిచి తీరుతామని..అడ్డుకునే ప్రయత్నం చేస్తే ఉక్కుపాదంతో అణచివేస్తామని స్పష్టం చేసింది.దీనిమీద భిన్నాభిప్రాయాలున్నా...చైనా అభివ్రుద్దికి ఆ ప్రభుత్వం తీసుకునే కఠిన నిర్ణయాలే కారణమని..అందువల్లనే ఇవాళ ప్రపంచాన్ని శాషించే స్థితికి చైనా చేరుకోగలుగుతున్నదని రాజకీయ విమర్శకులు విష్లేషించడం మనం చూస్తున్నాం కూడా.
ఈ నేపధ్యంలో పరిశీలిస్తే..ప్రజా ప్రయోజనాలే పరమావధిగా భావించే మావోయిస్టు పార్టీ కూడా తన విధానాలకు వ్యతిరేకంగా వ్యవహరించే ఎవరినైనా ఉపేక్షించదు. కోవర్టుల పేరుతో ఆ పేరుతో ఈ పేరుతో ప్రజా కోర్టులో కఠిన శిక్షలు విధిస్తున్నది.
అట్లా ఏ ప్రభుత్వమైనా పార్టీ అయినా తమ ప్రజాస్వామిక విధానాలను అమలు పరిచేందుకు కటిన నిర్ణయాలు తీసుకుంటది..అది అప్రజాస్వామికం అనిపించవచ్చు .. కని దీర్ఘకాలిక ప్రజా ప్రయోజనాల ద్రుష్ట్యా అది అనివార్యమని చరిత్ర నిరూపించింది.
ఈ నేపధ్యంలో నిరుద్యోగుల పేరుతో కోదండరాం నిర్వహిస్తున్న ర్యాలీ... ప్రజా స్వామ్యంలో తన అభిప్రాయం వినిపించే రాజ్యాంగం కల్పించిన హక్కుగానే కన్పించవచ్చు..కానీ ఇప్పుడిప్పుడే కుదురుకుంటున్న తెలంగాణకు ఇటువంటి చర్యలు విఘాతంగా మారుతయి. ప్రశాంతమైన తటాకంలో రాల్లు విసిరినట్టు..మూడేండ్లు కూడా నిండని తెలంగాణ రాష్ర్టం కుదురుకునేంత వరకు ఎటువంటి అంతర్గత అలజడులకు అవకాశం ఇవ్వకపోవడమే తెలంగాణ ప్రజలకు శ్రేయశ్కరం. సమస్యలేమయినా వుంటే చర్చలతో సాధించుకునే ప్రజా స్వామిక వాతావరణం ముఖ్యమంత్రి కెసిఆర్ పాలనలో వున్నప్పుడు..కచ్చెకు పోయి తన పంతం నెగ్గిచ్చుకోవాలని చూసే అసందర్భపు ప్రయత్నాలను ఆదిలోనే తిప్పికొట్టడంలో తెలంగాణ ప్రభుత్వం సఫలమైందని చెప్పవచ్చు. ఆ మేరుకు నిరుద్యోగుల ర్యాలీ పేరుతో కోదండరాం చేస్తున్న రాద్దాంతాన్ని ప్రభుత్వం సమర్దవంతంగానే తిప్పికొట్టగలిగింది.ఇది రేపటి తెలంగాణ అభివ్రుద్దికి మంచి శుభ సూచకం కూడా.
-- తెగువేరా
ప్రాటిటేరియట్ డిక్టేటర్ షిప్..వో అనివార్య ప్రక్రియ అని సిద్దాంతీకరించిన కారల్ మార్క్స్ మహానుభావుడు :
చరిత్రను వో పాలి పరిశీలిస్తే కొంత ఆశ్చర్యకరమే అయినా సైంటిఫిక్ అప్రోచ్ తో కూడిన నిర్ణయాలు సిద్దాంతాలు కనిపిస్తాయి. అవి సర్వకాల సర్వావస్తలయందు నిరూపణతో నిలుస్తయి. అట్లా అన్పించే వొక సిద్దాంతమే...ప్రాలిటేరియట్ డిక్టేటర్ షిప్..అంటే కార్మిక వర్గ నియంత్రుత్వం.
పీడిత వర్గాలకోసం తన జీవితాన్ని త్యాగం చేసి, ప్రపంచ చరిత్ర గతినే మలుపు తిప్పిన మహానుభావుడు కారల్ మార్క్స్.ఈ సిద్దాంతాన్ని ప్రతిపాదించిండు.
విప్లవ పోరాటాన్ని విజయవంతం చేయడం ద్వారా కార్మిక వర్గం అధికారం లోకి వస్తది.. అప్పుడు ఈ కార్మికవర్గ ప్రభుత్వం కొంత నియంత్రుత్వంగానే కొద్దిరోజుల పాటు పాలనను కొనసాగించాలంటడు మార్క్స్.
అదేంటిది.. సమ సమాజం కోసం పోరాడి త్యాగాలు చేసిన కార్మికుడు తాను అధికారంలోకి వచ్చినప్పుడు అత్యంత ప్రజాస్వామికంగా వ్యవహరించాలె కదా.. నియంత్రుత్వంగా వ్యవహరించడం ఏమిటి.. అనే డౌటు మనకు రావచ్చు.
దీనికి సంబంధించి అదే మార్క్స్ యేమంటడు అంటే..
అత్యంత ప్రజాస్వామికంగా వుండే రాజ్య స్తాపన జరుగాలంటే.. మానవులంతా సమానంగా వుండే సమ సమాజ స్తాపనను దీర్ఘకాలికంగా కొనసాగించాలంటే..కార్మిక వర్గం నియంత్రుత్వం కొన్నేండ్లపాటు తప్పదని నొక్కి చెపుతాడు. అట్లా ఎందుకు వ్యవహరించాలో అందుకు కారణాలు వివరిస్తడు..కారల్ మార్క్స్.
నూతన ప్రజా స్వామిక విప్లవం విజయవంతం కాగానే పరిపాలనలోకి వచ్చిన కార్మిక వర్గ ప్రభుత్వానికి గత పాలకులు వదిలిపెట్టి పోయిన అవలక్షణాల కంపు వెంటాడుతుంది. దాంతో అవలక్షణాలతో కూడిన పాలక విలువలు నూతన ప్రభుత్వానికి సమస్యగా మారుతయి. గత పాలనకు సంబంధించిన దుర్మార్గపు విలువలను అసమానతలఃతో కూడిన అవకాశవాద విలువలను రూపు మాపందే..కార్మిక వర్గ ప్రభుత్వం తన నూతన ప్రజా స్వామిక విలువలను ఎస్టాబ్లిష్ చేయడం కష్టం. కాబట్టి వీటిని రూపుమాపేందుకు ఈ పాజిటివ్ నియంత్రుత్వం అవసరం అంటడు మార్క్స్.
సమాజానికి అంటుకున్న పాత విలువలు అంత తొందరగా వదిలిపోవు. అలువాటు ప్రకారం అవే మూస పద్దతులు అన్ని రంగాలను తిరిగి బ్రష్టు పట్టించే అవకాశం వుంటది. అటువంటప్పడు అందుకు సంబంధించిన అలవాట్లను ఆలోచనలు కూడా మార్చాలె,.అట్లా మార్చందే కమ్యూనిస్టు వ్యవస్ధ స్థాపన కుదురదు అంటారు మార్క్స్. అందుకోసం కార్మిక వర్గ ప్రభుత్వం సొంత ప్రజల తోనయినా కఠినంగా వ్యవహరించి వారి ఆలోచనా ద్రుక్పదాన్ని మార్చాల్సిందే అని సిద్దాంతీకరిస్తడు.
వొక తండ్రి తన బిడ్డ బాగుండాలంటే ఆ బిడ్డ కోరిన కోరికనల్లా తీర్చే ప్రయత్నం చేయడు..అందులో తన బిడ్డ కు ఉపయోగపడే అంశమేందో విజ్నతతో పరిశీలించి తదుపరి నిర్ణయం తీసుకుంటడు. అంటే తన బిడ్డ యేమికోరిందో కాదు, ఆబిడ్డకేది అవసరమని భావిస్తాడో దాన్ని సమకూరుస్తడు.. అయితే..తన స్వేచ్చా స్వాతంత్ర్యాలను తన తండ్రి హరిస్తున్నడని ఇక్కడ ఆ బిడ్డ అనుకోవచ్చు...కని ఆ తండ్రి కంటే మిన్నగా ఎవరూ ఆ బిడ్డ క్షేమం కోరుకోరు అనేది మనకు తెలుసు.
ఇట్లాంటి అనేక సందర్భాలు చరిత్రలో మనం చూడవచ్చు. తమ స్వార్ద ప్రయోజనాలకోసం పనిచేసే ప్రభుత్వానికి వుండే నియంత్రుత్వ ధోరణులకు ప్రజా సంక్షేమం కోసం పాటుపడే ప్రజా ప్రభుత్వాల పాజిటివ్ నియంత్రుత్వం ధోరణులకు వుండే తేడాను మనం ఇక్కడ విజ్నతతో పరిశీలించాలె.
కొన్ని డిమాండ్లతో తియాన్మెన్ స్క్వేర్ వద్ద ధర్నా చేస్తున్న తన దేశ పౌరులను అనేక వార్నింగుల తర్వాత చైనా దారుణంగా అణచివేసింది. బుల్డోజర్లతో తొక్కించి అత్యంత కిరాతకంగా వ్యవహరించి వేలాది మందిని చంపేసింది కూడా. అప్పడు ప్రపంచ వ్యాప్తంగా చైనా అప్రజాస్వామ్యంగా వ్యవహరిస్తుందనే నిరసనలు వెల్లువెత్తాయి. అయినా చైనా ప్రభుత్వం ఏమాత్రం భయపడలేదు. దేశాన్ని మరింతగా అభివ్రుద్ది చేసేందుకు తమకంటూ వొక పాలసీ వున్నదని..ఎవరేమన్నా తమ విధానాలను అమలు పరిచి తీరుతామని..అడ్డుకునే ప్రయత్నం చేస్తే ఉక్కుపాదంతో అణచివేస్తామని స్పష్టం చేసింది.దీనిమీద భిన్నాభిప్రాయాలున్నా...చైనా అభివ్రుద్దికి ఆ ప్రభుత్వం తీసుకునే కఠిన నిర్ణయాలే కారణమని..అందువల్లనే ఇవాళ ప్రపంచాన్ని శాషించే స్థితికి చైనా చేరుకోగలుగుతున్నదని రాజకీయ విమర్శకులు విష్లేషించడం మనం చూస్తున్నాం కూడా.
ఈ నేపధ్యంలో పరిశీలిస్తే..ప్రజా ప్రయోజనాలే పరమావధిగా భావించే మావోయిస్టు పార్టీ కూడా తన విధానాలకు వ్యతిరేకంగా వ్యవహరించే ఎవరినైనా ఉపేక్షించదు. కోవర్టుల పేరుతో ఆ పేరుతో ఈ పేరుతో ప్రజా కోర్టులో కఠిన శిక్షలు విధిస్తున్నది.
అట్లా ఏ ప్రభుత్వమైనా పార్టీ అయినా తమ ప్రజాస్వామిక విధానాలను అమలు పరిచేందుకు కటిన నిర్ణయాలు తీసుకుంటది..అది అప్రజాస్వామికం అనిపించవచ్చు .. కని దీర్ఘకాలిక ప్రజా ప్రయోజనాల ద్రుష్ట్యా అది అనివార్యమని చరిత్ర నిరూపించింది.
ఈ నేపధ్యంలో నిరుద్యోగుల పేరుతో కోదండరాం నిర్వహిస్తున్న ర్యాలీ... ప్రజా స్వామ్యంలో తన అభిప్రాయం వినిపించే రాజ్యాంగం కల్పించిన హక్కుగానే కన్పించవచ్చు..కానీ ఇప్పుడిప్పుడే కుదురుకుంటున్న తెలంగాణకు ఇటువంటి చర్యలు విఘాతంగా మారుతయి. ప్రశాంతమైన తటాకంలో రాల్లు విసిరినట్టు..మూడేండ్లు కూడా నిండని తెలంగాణ రాష్ర్టం కుదురుకునేంత వరకు ఎటువంటి అంతర్గత అలజడులకు అవకాశం ఇవ్వకపోవడమే తెలంగాణ ప్రజలకు శ్రేయశ్కరం. సమస్యలేమయినా వుంటే చర్చలతో సాధించుకునే ప్రజా స్వామిక వాతావరణం ముఖ్యమంత్రి కెసిఆర్ పాలనలో వున్నప్పుడు..కచ్చెకు పోయి తన పంతం నెగ్గిచ్చుకోవాలని చూసే అసందర్భపు ప్రయత్నాలను ఆదిలోనే తిప్పికొట్టడంలో తెలంగాణ ప్రభుత్వం సఫలమైందని చెప్పవచ్చు. ఆ మేరుకు నిరుద్యోగుల ర్యాలీ పేరుతో కోదండరాం చేస్తున్న రాద్దాంతాన్ని ప్రభుత్వం సమర్దవంతంగానే తిప్పికొట్టగలిగింది.ఇది రేపటి తెలంగాణ అభివ్రుద్దికి మంచి శుభ సూచకం కూడా.
-- తెగువేరా
No comments:
Post a Comment