Arunachaleswarar Temple - Thiruvannamalai
సర్వదేవతావాసం.. అరుణాచలం
శ్రీశైలం శిఖరం దృష్ట్యా పునర్జన్మ నవిశ్యతి శ్రీశైల శిఖరం చూసినవారికి పునర్జన్మ లేకుండా శివసాయుజ్యం దొరుకుతుంది. కాశీకాశీ కాశీ అని మూడు సార్లు స్మరిస్తే చాలు శివుడు ముక్తిని ప్రసాదిస్తాడు. అటువంటి దయామయుడు ఆ మహాశివుడు. ఆ శివుడే బ్రహ్మవిష్ణుల మధ్య ఆవరించిన అహంకారపొరను నాశనం చేయడానికి తనకై తాను మహా జ్యోతిస్వరూపంతో ఆవిర్భంచాడు. ఆ జ్యోతిస్వరూప ఆద్యంతాలను తెలుసుకోలేకపోయారు బ్రహ్మవిష్ణువులు. వారిలో వారు మధనపడ్డారు. దయాళుడు, వాత్సల్యపూరితుడైన పరమశివుడే వారిలో జ్ఞానబీజం అంకురింపచేశాడు. వెనువెంటనే వారు తమ అహంకారాన్ని వీడారు. ఆ మహాజ్యోతిస్వరూపం పరమాత్మను అని గ్రహించారు. తమ తప్పును క్షమించమని పదేపదే వేడుకొన్నారు. వారితో పాటు అత్యద్భుతాన్ని చూచిన సాధుసజ్జనులు, సిద్ధసాధ్య యక్షకినె్నర కింపురుషాదులందరూ ఆ జ్యోతిస్వరూపాన్ని తమలో ఉన్న అజ్ఞానాన్ని రూపుమాపి జ్ఞానభిక్షనుప్రసాదించమని ప్రార్థించారు. పార్వతీ ప్రియవల్లభుడు శాంతిస్తూ చివరకి స్థావరలింగంగా అంటే పర్వతరూపాన్ని గ్రహించాడు. ఆ పర్వతరూపమే నేటి అరుణాచలం. కృతయుగంలో అగ్నిమయంగా భాసించిన ఈ అగ్నిలింగమే త్రేతాయుగంలోరత్నాచలమై తేజోమయంగా కనిపించింది. ద్వాపరంలో సువర్ణమయమై హేమపర్వతంగా గోచరించింది. ఆ అగ్ని లింగమే నేడు మరకతాచలంగా అరుణాచలంగా వేనోళ్లకీర్తించబడుతోంది.
మహాశివుడే స్వయంగా అరుణాచల మాహాత్మ్యాన్ని తెలుసుకొనమని తన ప్రియసతిని పార్వతీదేవిని గౌతముని దగ్గరకు పంపించాడు. అరుణాచల ఖ్యాతి, ప్రసిద్ధి ఇంతింత అని చెప్పనలవికానిది. పర్వతరూపాన్ని స్వీకరించిన పరమేశ్వరుడిని పూజించడానికి సర్వదేవతలు దివినుంచి దిగివచ్చారు.
ఖడ్గతీర్థం
అగ్నిపర్వతంగానిలిచిన మహాజ్యోతిస్వరూపాన్ని గౌతముని ద్వారా తెలుసుకోవడానికి వచ్చిన పార్వతీదేవితో స్వయంగా అశరీరవాణి ఇలా చెప్పింది. ‘‘ఓ మహిషాసుర మర్దినిగా వెలిగిన పరమేశ్వరీ! నీ ఖడ్గంతో అరుణాచలంలోని రాయిని పగులకొట్టు అక్కడ నుంచి తొమ్మిది తీర్థరాజాలు వెలువడుతాయి. ఆ తీర్థాలలో నీవు స్నానమాచరించు అప్పుడు మహిషుడి కంఠం నుంచి వెలువడి నీ చేతిని అంటిపెట్టుకొన్న లింగం విడవడుతుంది. ఆ లింగాన్ని అక్కడే ప్రతిష్టించు, ఈ శివలింగాన్ని ఎవరైతే పూజిస్తారో వారికి సహస్ర అశ్వమేథ యాగఫలం దక్కుతుంది. ఎన్నికోట్ల పాపరాశులున్నా అవి అన్నీ చిన్ని అగ్నిరవ్వ దూది రాశులను నాశనం చేసినట్లుగా నాశనం అవుతాయి’’ అని పలికింది. ఆమాట ప్రకారమే పార్వతీదేవి తన ఖడ్గంతో రాయిని పగులుకొట్టింది. ఈ తీర్థమే నేడు పారెస్ట్ ఆఫీసుకు దగ్గరగా ఉన్న దుర్గాలయంలో దర్శనమిస్తోంది.
ఆ పార్వతీదేవి ‘విశ్వరూపా, కాలస్వరూపా, అచలేశ్వరా! దయతోనాకు నీ దర్శనభాగ్యం కలిగించమని ప్రార్థించింది. ఆ కరుణామూర్తి పార్వతీదేవి పూజలకు సంతృప్తిచెంది దర్శనమిచ్చి ఇంకా ఇలా పలికాడు. ‘‘ఓ పార్వతీ నీ సద్భక్తికి మెచ్చాను.దీక్షలేకుండా నియమనిష్ఠలు పాటించకుండా నాలింగాన్ని గ్రహించితన కంఠంమందు ధరించి నా పైవిశ్వాసాన్నిప్రకటించని మహిషుడు కనుకనే నీ చేతిలో సంహరించబడ్డాడు. ఆ పాపక్షయానికి నీవు నన్ను కృత్తికా నక్షత్ర ఉచ్చదశయందు పూజించావు. నీ పాపం నశించింది. నీ శ్రద్ధ్భాక్తులకు నేను వశుడినయ్యాను. కనుక నీవు ఇక ఇప్పటినుంచి ‘‘అపీతకుచాంబిక’’ అన్న పేరు తోప్రఖ్యాతవౌతావు’’అని వరమిచ్చాడు. పరమశివుని దయకు ప్రీతి చెందిన గౌరీదేవి ‘‘ మహాదేవా! అపారకరుణాలవాల! నీవు నన్ను అనుగ్రహించినట్లుగానే ప్రతి కార్తికమాస కృత్తికా నక్షత్రమున సమస్తప్రజలకు నీ దర్శనభాగ్యమును కలుగుచేయము. దానిద్వారా వారి వారి పాపరాశులు దగ్ధమయ్యేలా అనుగ్రహించమని వేడుకొంటున్నాను’’అంది. పరమేశ్వరుడుతథాస్తు అని పలికాడు. ఇప్పటికీ కృత్తికానక్షత్ర యుక్తకాలంలో అరుణాచలేశ్వరుని దర్శనం ముక్తిదాయకంగానే వెలుగొందుతోంది.
అరుణగిరి తీర్థరాజాలు
‘‘నమస్తామ్రాయారుణాయ శివాయ పరమాత్మనే వేదవేద్య స్వరూపాయ సోమాయ సుఖరూపిణే’’ అని వేదాలు కీర్తించే అరుణాచలేశ్వరుని పూజించటానికి సర్వదేవతలు, సర్వతీర్థరాజాలు అరుణాచలంలో కూడాయి. అరుణాచలానికి తూర్పుదిక్కున ఇంద్రతీర్థంగా ఉంది. ఇందులో స్నానమాచరించిన ఇంద్రుడు తన బ్రహ్మహత్యాదోషాన్ని పోగొట్టుకొన్నాడు. అగ్నేయదిశలో ఉన్న బ్రహ్మతీర్థంలో స్నానమాడి అగ్నిదేవుడు పరస్ర్తి సంగమ దోషాన్ని నివారించుకున్నాడు. దక్షిణదిశలో ఉన్న యమతీర్థంలో స్నానం చేసిన యముడు బ్రహ్మాస్త్ర భయమునువీడాడు. నైరుతీ తీర్థంలో స్నానముచేసిన ఋషిపుంగవులు ప్రేత భేతాళాలపై విజయాన్ని సాధించారు. వరుణ తీర్థంలో స్నానమాడిన వరుణుడు తాను చేజార్చుకున్న అస్థిపంజరాన్ని తిరిగి పొందాడు. వాయుతీర్థంలో స్నానమాడిన పవనుడు జగత్తుకే ప్రాణమైనాడు.. సోమ తీర్థంలో స్నానంచేసిన చంద్రుడు క్షయరోగవిముక్తుడయ్యాడు. విష్ణుతీర్థములో మహావిష్ణువే స్నానమాచరించాడు. అలా ఇక్కడి తీర్థరాజాలన్నీ చెప్పలేనన్ని మాహాత్మ్యాలను కలిగిఉన్నాయి.
మహాశివుడే స్వయంగా అరుణాచల మాహాత్మ్యాన్ని తెలుసుకొనమని తన ప్రియసతిని పార్వతీదేవిని గౌతముని దగ్గరకు పంపించాడు. అరుణాచల ఖ్యాతి, ప్రసిద్ధి ఇంతింత అని చెప్పనలవికానిది. పర్వతరూపాన్ని స్వీకరించిన పరమేశ్వరుడిని పూజించడానికి సర్వదేవతలు దివినుంచి దిగివచ్చారు.
ఖడ్గతీర్థం
అగ్నిపర్వతంగానిలిచిన మహాజ్యోతిస్వరూపాన్ని గౌతముని ద్వారా తెలుసుకోవడానికి వచ్చిన పార్వతీదేవితో స్వయంగా అశరీరవాణి ఇలా చెప్పింది. ‘‘ఓ మహిషాసుర మర్దినిగా వెలిగిన పరమేశ్వరీ! నీ ఖడ్గంతో అరుణాచలంలోని రాయిని పగులకొట్టు అక్కడ నుంచి తొమ్మిది తీర్థరాజాలు వెలువడుతాయి. ఆ తీర్థాలలో నీవు స్నానమాచరించు అప్పుడు మహిషుడి కంఠం నుంచి వెలువడి నీ చేతిని అంటిపెట్టుకొన్న లింగం విడవడుతుంది. ఆ లింగాన్ని అక్కడే ప్రతిష్టించు, ఈ శివలింగాన్ని ఎవరైతే పూజిస్తారో వారికి సహస్ర అశ్వమేథ యాగఫలం దక్కుతుంది. ఎన్నికోట్ల పాపరాశులున్నా అవి అన్నీ చిన్ని అగ్నిరవ్వ దూది రాశులను నాశనం చేసినట్లుగా నాశనం అవుతాయి’’ అని పలికింది. ఆమాట ప్రకారమే పార్వతీదేవి తన ఖడ్గంతో రాయిని పగులుకొట్టింది. ఈ తీర్థమే నేడు పారెస్ట్ ఆఫీసుకు దగ్గరగా ఉన్న దుర్గాలయంలో దర్శనమిస్తోంది.
ఆ పార్వతీదేవి ‘విశ్వరూపా, కాలస్వరూపా, అచలేశ్వరా! దయతోనాకు నీ దర్శనభాగ్యం కలిగించమని ప్రార్థించింది. ఆ కరుణామూర్తి పార్వతీదేవి పూజలకు సంతృప్తిచెంది దర్శనమిచ్చి ఇంకా ఇలా పలికాడు. ‘‘ఓ పార్వతీ నీ సద్భక్తికి మెచ్చాను.దీక్షలేకుండా నియమనిష్ఠలు పాటించకుండా నాలింగాన్ని గ్రహించితన కంఠంమందు ధరించి నా పైవిశ్వాసాన్నిప్రకటించని మహిషుడు కనుకనే నీ చేతిలో సంహరించబడ్డాడు. ఆ పాపక్షయానికి నీవు నన్ను కృత్తికా నక్షత్ర ఉచ్చదశయందు పూజించావు. నీ పాపం నశించింది. నీ శ్రద్ధ్భాక్తులకు నేను వశుడినయ్యాను. కనుక నీవు ఇక ఇప్పటినుంచి ‘‘అపీతకుచాంబిక’’ అన్న పేరు తోప్రఖ్యాతవౌతావు’’అని వరమిచ్చాడు. పరమశివుని దయకు ప్రీతి చెందిన గౌరీదేవి ‘‘ మహాదేవా! అపారకరుణాలవాల! నీవు నన్ను అనుగ్రహించినట్లుగానే ప్రతి కార్తికమాస కృత్తికా నక్షత్రమున సమస్తప్రజలకు నీ దర్శనభాగ్యమును కలుగుచేయము. దానిద్వారా వారి వారి పాపరాశులు దగ్ధమయ్యేలా అనుగ్రహించమని వేడుకొంటున్నాను’’అంది. పరమేశ్వరుడుతథాస్తు అని పలికాడు. ఇప్పటికీ కృత్తికానక్షత్ర యుక్తకాలంలో అరుణాచలేశ్వరుని దర్శనం ముక్తిదాయకంగానే వెలుగొందుతోంది.
అరుణగిరి తీర్థరాజాలు
‘‘నమస్తామ్రాయారుణాయ శివాయ పరమాత్మనే వేదవేద్య స్వరూపాయ సోమాయ సుఖరూపిణే’’ అని వేదాలు కీర్తించే అరుణాచలేశ్వరుని పూజించటానికి సర్వదేవతలు, సర్వతీర్థరాజాలు అరుణాచలంలో కూడాయి. అరుణాచలానికి తూర్పుదిక్కున ఇంద్రతీర్థంగా ఉంది. ఇందులో స్నానమాచరించిన ఇంద్రుడు తన బ్రహ్మహత్యాదోషాన్ని పోగొట్టుకొన్నాడు. అగ్నేయదిశలో ఉన్న బ్రహ్మతీర్థంలో స్నానమాడి అగ్నిదేవుడు పరస్ర్తి సంగమ దోషాన్ని నివారించుకున్నాడు. దక్షిణదిశలో ఉన్న యమతీర్థంలో స్నానం చేసిన యముడు బ్రహ్మాస్త్ర భయమునువీడాడు. నైరుతీ తీర్థంలో స్నానముచేసిన ఋషిపుంగవులు ప్రేత భేతాళాలపై విజయాన్ని సాధించారు. వరుణ తీర్థంలో స్నానమాడిన వరుణుడు తాను చేజార్చుకున్న అస్థిపంజరాన్ని తిరిగి పొందాడు. వాయుతీర్థంలో స్నానమాడిన పవనుడు జగత్తుకే ప్రాణమైనాడు.. సోమ తీర్థంలో స్నానంచేసిన చంద్రుడు క్షయరోగవిముక్తుడయ్యాడు. విష్ణుతీర్థములో మహావిష్ణువే స్నానమాచరించాడు. అలా ఇక్కడి తీర్థరాజాలన్నీ చెప్పలేనన్ని మాహాత్మ్యాలను కలిగిఉన్నాయి.
అరుణాచలేశ్వర దేవాలయం
సర్వ ఔషధీగుణాలతో ఉన్న వృక్షరాజాలు, లెక్కలేనన్ని ప్రశస్తులు, సర్వతీర్థాలున్న అరుణగిరిలో అరుణాచలేశ్వరుడు కొలువైయ్యాడు. ఈ అరుణాచల దేవాలయం ఎతె్తైన ప్రాకారాలతో చుట్టూ గోపురాలతో అతి పెద్ద దేవాలయంగా చూపురులను ఆకట్టుకుంటోంది. తూర్పు వైపున ఉన్న రాజగోపురం శ్రీకృష్ణదేవరాయలునిర్మించారని చరిత్రకథనం. దక్షిణభారత దేశములందని అన్ని దేవాలయ గోపురాలలోకి ఇది చాలా ఎతె్తైనదిగా ప్రఖ్యాతి పొందింది. రెండవ ప్రాకారంలో ఉన్న రెండవ గోపురంగా ఉన్న ‘‘్భళ్లాల గోపురం’’ దీనిని భళ్ళాల మహారాజు కట్టించారు. దీనే్న ‘కిళిగోపురం’ అంటారు. ఇక్కడ అరుణగిరినాథుడు చిలుకరూపంలో దర్శనమిస్తాడని అంటారు. ఉత్తర దిక్కున ఉన్న గోపురాన్ని మహాభక్తురాలైన అమ్మణ్ణియమ్మ చందాలు పోగుచేసి కట్టించినట్లుగా స్థలపురాణం చెబుతోంది. అందుకే దీనిని ‘‘అమ్మణ్ణియమ్మ గోపురం’’అని పిలుస్తారు. పడమర గోపురము పేయి గోపురం( అరుణగిరి యోగి మండపం ఉన్న స్థలం)గా ప్రసిద్ధివహించింది. ఇలా నాలుగువైపులా నాలుగు గోపురాలతో అలరారే ఈ అరుణాచలదేవాలయంలో ఎన్నోమందిరాలున్నాయి. సర్వసిద్ధి వినాయకుడు, పెద్ద నంది, గోపుర సుబ్రహ్మణ్యస్వామి, కల్యాణ సుందరేశ్వరుడు, కాలభైరవుడు, బ్రహ్మప్రతిష్టిత లింగం ఇలా ఎన్నో మందిరాలున్నాయి. ప్రత్యేకమంటపాలున్నాయి. ఈ దేవాలయం దేవీదేవతలతో పాటు మహాభక్తులకు కూడా నెలవు. అటువంటి ఈ అరుణాచలదేవాలయంలోని గర్భగుడిలో అరుణాచలేశ్వరుడు స్వయం భూఃలింగంగాదర్శనమిస్తాడు. ఈ స్వయంభూఃలింగం సర్వాంగసుందరంగా సర్వసిద్ధి ప్రదమై పానపట్టముపై విరాజిల్లుతూ కనులకింపును కలుగచేస్తుంది. సర్వదేవతలు ముప్పైమూడు కోట్లమంది కొలువై ఉన్న ఈ అరుణాచలాన్ని దర్శించడం ఎన్నో జన్మల పూర్వపుణ్యంగా శివభక్తులు భావిస్తారు. అరుణాచల వర్ణన అనుభవైకవేద్యమేకాని ఈ గిరి వర్ణనకు మాటలు చాలవు.
సర్వ ఔషధీగుణాలతో ఉన్న వృక్షరాజాలు, లెక్కలేనన్ని ప్రశస్తులు, సర్వతీర్థాలున్న అరుణగిరిలో అరుణాచలేశ్వరుడు కొలువైయ్యాడు. ఈ అరుణాచల దేవాలయం ఎతె్తైన ప్రాకారాలతో చుట్టూ గోపురాలతో అతి పెద్ద దేవాలయంగా చూపురులను ఆకట్టుకుంటోంది. తూర్పు వైపున ఉన్న రాజగోపురం శ్రీకృష్ణదేవరాయలునిర్మించారని చరిత్రకథనం. దక్షిణభారత దేశములందని అన్ని దేవాలయ గోపురాలలోకి ఇది చాలా ఎతె్తైనదిగా ప్రఖ్యాతి పొందింది. రెండవ ప్రాకారంలో ఉన్న రెండవ గోపురంగా ఉన్న ‘‘్భళ్లాల గోపురం’’ దీనిని భళ్ళాల మహారాజు కట్టించారు. దీనే్న ‘కిళిగోపురం’ అంటారు. ఇక్కడ అరుణగిరినాథుడు చిలుకరూపంలో దర్శనమిస్తాడని అంటారు. ఉత్తర దిక్కున ఉన్న గోపురాన్ని మహాభక్తురాలైన అమ్మణ్ణియమ్మ చందాలు పోగుచేసి కట్టించినట్లుగా స్థలపురాణం చెబుతోంది. అందుకే దీనిని ‘‘అమ్మణ్ణియమ్మ గోపురం’’అని పిలుస్తారు. పడమర గోపురము పేయి గోపురం( అరుణగిరి యోగి మండపం ఉన్న స్థలం)గా ప్రసిద్ధివహించింది. ఇలా నాలుగువైపులా నాలుగు గోపురాలతో అలరారే ఈ అరుణాచలదేవాలయంలో ఎన్నోమందిరాలున్నాయి. సర్వసిద్ధి వినాయకుడు, పెద్ద నంది, గోపుర సుబ్రహ్మణ్యస్వామి, కల్యాణ సుందరేశ్వరుడు, కాలభైరవుడు, బ్రహ్మప్రతిష్టిత లింగం ఇలా ఎన్నో మందిరాలున్నాయి. ప్రత్యేకమంటపాలున్నాయి. ఈ దేవాలయం దేవీదేవతలతో పాటు మహాభక్తులకు కూడా నెలవు. అటువంటి ఈ అరుణాచలదేవాలయంలోని గర్భగుడిలో అరుణాచలేశ్వరుడు స్వయం భూఃలింగంగాదర్శనమిస్తాడు. ఈ స్వయంభూఃలింగం సర్వాంగసుందరంగా సర్వసిద్ధి ప్రదమై పానపట్టముపై విరాజిల్లుతూ కనులకింపును కలుగచేస్తుంది. సర్వదేవతలు ముప్పైమూడు కోట్లమంది కొలువై ఉన్న ఈ అరుణాచలాన్ని దర్శించడం ఎన్నో జన్మల పూర్వపుణ్యంగా శివభక్తులు భావిస్తారు. అరుణాచల వర్ణన అనుభవైకవేద్యమేకాని ఈ గిరి వర్ణనకు మాటలు చాలవు.
అరుణగిరి ప్రదక్షిణ
‘‘యానికాని చ పాపాని జన్మాంతర కృతానిచ, తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదేపదే’’ అంటూ ప్రదక్షిణ నమస్కారాలు చేసినంతనే పాపాలను బాపే పరమశివుడు అరుణాచలేశ్వరునిగా రూపుదిద్దుకున్నాడు. ఆ అరుణగిరిని ప్రదక్షిణ చేసినవారికి కోటి అశ్వమేథ యాగములు, కోటి వాజపేయ యజ్ఞములు సర్వతీర్థస్నానఫలితాన్ని ఇలా ఎన్నింటినో ప్రసాదించగలదు. అటువంటి ఆ గిరి ప్రదక్షిణను ఆదివారం చేసినవారు సూర్యమండలాన్ని చేధించుకుని శివలోకాన్ని చేరుకుంటారు. సోమవారం ప్రదక్షిణ చేసినవారు అజరామత్వాన్ని పొందుతారు.
మంగళవారం ప్రదక్షిణ చేసినవారు సార్వభౌమత్వాన్ని అర్హులవుతారు. బుధవారం ప్రదక్షిణ చేసినవారు సర్వజ్ఞత్వము, మహాపాండిత్యానికి కేంద్రబిందువు అవుతారు. గురువారం ప్రదక్షిణ చేసినవారు సర్వదేవతలు నమస్కరించదగిన లోకగురత్వమును పొందుతారు. శుక్రవారం ప్రదక్షిణ చేస్తే విష్ణుసాయుజ్యాన్ని చేరుకుంటారు. శనివారం నాడు అరుణగిరి ప్రదక్షిణలు చేసినవారు గ్రహపీడలు తొలిగిపోయి విశ్వవిజయులు అవుతారు అని స్వయంగా పరమశివుడే వాక్రుచ్చాడు.
అరుణాధ్రీశ్వరుని ప్రదక్షిణ చేసినవారు స్వయంగా శివస్వరూపులే అని గౌతమమహర్షి పార్వతీ దేవికి చెప్పాడని పురాణాలు చెబుతున్నాయి. గిరి ప్రదక్షిణ సమయంలో శ్రీరమణాశ్రమము, పాలితీర్థము, అణ్ణామలై ఆశ్రమము, సుబ్రహ్మణ్య దేవాలయం, యమలింగం, గణేశ గుడి, హనుమాన్ దేవాలయం, ఉణ్ణామలై అమ్మగుడి, రామలింగేశ్వరాలయం, రాఘవేంద్రుని ఆలయం, గౌతమాశ్రమము, సూర్యలింగం, కుబేరలింగం, అగ్నిలింగం ఇలా ఎన్నింటినో చూడవచ్చు.
‘‘యానికాని చ పాపాని జన్మాంతర కృతానిచ, తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదేపదే’’ అంటూ ప్రదక్షిణ నమస్కారాలు చేసినంతనే పాపాలను బాపే పరమశివుడు అరుణాచలేశ్వరునిగా రూపుదిద్దుకున్నాడు. ఆ అరుణగిరిని ప్రదక్షిణ చేసినవారికి కోటి అశ్వమేథ యాగములు, కోటి వాజపేయ యజ్ఞములు సర్వతీర్థస్నానఫలితాన్ని ఇలా ఎన్నింటినో ప్రసాదించగలదు. అటువంటి ఆ గిరి ప్రదక్షిణను ఆదివారం చేసినవారు సూర్యమండలాన్ని చేధించుకుని శివలోకాన్ని చేరుకుంటారు. సోమవారం ప్రదక్షిణ చేసినవారు అజరామత్వాన్ని పొందుతారు.
మంగళవారం ప్రదక్షిణ చేసినవారు సార్వభౌమత్వాన్ని అర్హులవుతారు. బుధవారం ప్రదక్షిణ చేసినవారు సర్వజ్ఞత్వము, మహాపాండిత్యానికి కేంద్రబిందువు అవుతారు. గురువారం ప్రదక్షిణ చేసినవారు సర్వదేవతలు నమస్కరించదగిన లోకగురత్వమును పొందుతారు. శుక్రవారం ప్రదక్షిణ చేస్తే విష్ణుసాయుజ్యాన్ని చేరుకుంటారు. శనివారం నాడు అరుణగిరి ప్రదక్షిణలు చేసినవారు గ్రహపీడలు తొలిగిపోయి విశ్వవిజయులు అవుతారు అని స్వయంగా పరమశివుడే వాక్రుచ్చాడు.
అరుణాధ్రీశ్వరుని ప్రదక్షిణ చేసినవారు స్వయంగా శివస్వరూపులే అని గౌతమమహర్షి పార్వతీ దేవికి చెప్పాడని పురాణాలు చెబుతున్నాయి. గిరి ప్రదక్షిణ సమయంలో శ్రీరమణాశ్రమము, పాలితీర్థము, అణ్ణామలై ఆశ్రమము, సుబ్రహ్మణ్య దేవాలయం, యమలింగం, గణేశ గుడి, హనుమాన్ దేవాలయం, ఉణ్ణామలై అమ్మగుడి, రామలింగేశ్వరాలయం, రాఘవేంద్రుని ఆలయం, గౌతమాశ్రమము, సూర్యలింగం, కుబేరలింగం, అగ్నిలింగం ఇలా ఎన్నింటినో చూడవచ్చు.
No comments:
Post a Comment