నిప్పులు చెరిగిన స్మృతి.. మౌనం వహించిన ప్రతిపక్షం
కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి స్మృతీ ఇరానీ బుధవారం లోక్ సభలో నిప్పులు చెరిగారు. సహనముంటే కూర్చుని వినండి లేదా.. బయటకు నడవండని ప్రతిపక్షానికి సూచించారు. చాణక్యుడికి కూడా కాషాయం అంటగట్టగల సమర్థులున్నారని ఆమె మండిపడ్డారు. కాంగ్రెస్ హయాంలోనే 21మంది వైస్ చాన్సెలర్లు నియమితులయ్యారని తెలిపారు. రోహిత్ మృతదేహాన్ని పెట్టుకుని రాజకీయం చేశారని ఆమె విమర్శించారు. తెలంగాణ ఉద్యమం సమయంలో 600 మంది విద్యార్థులు చనిపోతే ఒక్కసారైనా అక్కడకు వెళ్ళని రాహుల్ గాంధీ, రోహిత్ వేముల అంశంలో రెండుసార్లు హైదరాబాద్కు వెళ్ళారని ఆమె ఉదాహరణగా చెప్పారు. హెచ్సియూ అంశంపై కాంగ్రెస్ నేత వి హనుమంతరావు ఎన్నిసార్లు లేఖలు రాశారో వివరించారు. జెఎన్యూలో హిందూ దేవుళ్ళని దూషిస్తారా అంటూ నిప్పులు కురిపించారు. దేశానికి వ్యతిరేకంగా ఎటువంటి నినాదాలు చేశారో ఆమె చదివి వినిపించారు. పాఠ్య పుస్తకాల అంశాన్ని రాజకీయం చేసేస్తున్నారన్నారు. ఆమె వాగ్ధాటిని మౌనంగా వినడం తప్ప ప్రతిపక్షం వద్ద సమాధానం లేకపోయింది
కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి స్మృతీ ఇరానీ బుధవారం లోక్ సభలో నిప్పులు చెరిగారు. సహనముంటే కూర్చుని వినండి లేదా.. బయటకు నడవండని ప్రతిపక్షానికి సూచించారు. చాణక్యుడికి కూడా కాషాయం అంటగట్టగల సమర్థులున్నారని ఆమె మండిపడ్డారు. కాంగ్రెస్ హయాంలోనే 21మంది వైస్ చాన్సెలర్లు నియమితులయ్యారని తెలిపారు. రోహిత్ మృతదేహాన్ని పెట్టుకుని రాజకీయం చేశారని ఆమె విమర్శించారు. తెలంగాణ ఉద్యమం సమయంలో 600 మంది విద్యార్థులు చనిపోతే ఒక్కసారైనా అక్కడకు వెళ్ళని రాహుల్ గాంధీ, రోహిత్ వేముల అంశంలో రెండుసార్లు హైదరాబాద్కు వెళ్ళారని ఆమె ఉదాహరణగా చెప్పారు. హెచ్సియూ అంశంపై కాంగ్రెస్ నేత వి హనుమంతరావు ఎన్నిసార్లు లేఖలు రాశారో వివరించారు. జెఎన్యూలో హిందూ దేవుళ్ళని దూషిస్తారా అంటూ నిప్పులు కురిపించారు. దేశానికి వ్యతిరేకంగా ఎటువంటి నినాదాలు చేశారో ఆమె చదివి వినిపించారు. పాఠ్య పుస్తకాల అంశాన్ని రాజకీయం చేసేస్తున్నారన్నారు. ఆమె వాగ్ధాటిని మౌనంగా వినడం తప్ప ప్రతిపక్షం వద్ద సమాధానం లేకపోయింది
No comments:
Post a Comment