ఆముక్తమాల్యద.
శ్రీ కమనీయ హార మణి జెంనుగా దానును, గౌస్తుభంబునం
డా కమలా వధూటియు నుదారత దోప బరస్పరాత్మలం
దాకలితంబులై తమయాక్రుతుల చ్చత బైకిదోచి య
స్తోకత నందు దోచే నన శోభిలు వేంకటభర్త గొల్చెదన్.
డా కమలా వధూటియు నుదారత దోప బరస్పరాత్మలం
దాకలితంబులై తమయాక్రుతుల చ్చత బైకిదోచి య
స్తోకత నందు దోచే నన శోభిలు వేంకటభర్త గొల్చెదన్.
సాహితీ సమరాంగణ సార్వభౌముడు శ్రీకృష్ణదేవరాయలు ఆముక్తమాల్యద ప్రబంధంలో వ్రాసిన తొలి పద్యం. తన ఇష్టదైవం తిరుమల వేంకటేశుని స్తుతి. లక్ష్మీదేవి సుందరమగు హారమణి యందు వేంకటేశుడు కనిపిస్తున్నాడు. అతని కౌస్తుభమందు ఆ లక్ష్మి ప్రతిబింబిస్తూంది. పరస్పరములందు (ఒకరి మీద ఒకరికి) ప్రేమాతిశయముచే నిలిచియున్న తమ ఇద్దరి ఆకారాలను శరీర స్వచ్చతచేత బహిః ప్రకాశములై ఆ రత్నములందు కానవచ్చాయా అన్నట్టు విలసిల్లుతున్న వేంకటేశ్వరుని సేవించెదను.
No comments:
Post a Comment