UTILIZE THE BY IDENTIFYING THE HUMAN AS RARE IDENTITY GRANTED BY NATURE IN THE WITNESS

My PhotoMy Photo
Mother Late P.Rangaveni
Father: Late PGKsaibaba My younger brother (Late)
P.S.Bhanu Prasad


His Majestic Highness Jagadguruvulu Maharani Sametha Maharajah Shri Shri Shri Anjani Ravishankar Pilla vaaru
in the address of Hon. Chief Justice,
Supreme court of India,
New Delhi

Image may contain: text
జేబులో పెట్టుకొన్న ఫోన్ నుండి మాటలు వింటున్నారు కంప్యూటర్ ను హేక్ చేసి, ఈమైల్స్ అన్నీ చూస్తునారు, కంప్యూటర్ ముందు కుర్చుని ఎవరి ఏమి మాట్లాడుకొంటున్నా విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు అ విధంగా బౌతికంగా మేము బలం గా ఉన్నాము మేమే తెలివైన వారము మమ్ములను ఎవరూ ఏమి చెయ్య లేరు అన్నట్లు అలోచిస్త్రున్నారు, ఇందులో వ్యక్తులు కొందరు పోలీసులు మీడియా లో ఉన్న వారు కలసి గ్రూప్ గా ఫారం అయ్యి రహస్యం కులం కోసం డబ్బు కోసం సుఖాలు కోసం, రాజకీయంగా సామాజికంగా దెబ్బ కొడుతున్నారు ఎవరి మాటలు అయిన విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు, రహస్య సేటిలైట్ కెమెరాలు ఉపయోగించుకొని మోసం చేస్తున్నారు.

Sunday, 21 February 2016

కరవును జయించిన యువ రైతు • ఐదెకరాల్లో ఐదు పంటలు • దిగుబడులతోపాటు లాభార్జన • ఆదర్శంగా నిలిచిన రాఘవేంద్ర


* తలంచి.. ఫలించి ...!
• కరవును జయించిన యువ రైతు
• ఐదెకరాల్లో ఐదు పంటలు
• దిగుబడులతోపాటు లాభార్జన 
• ఆదర్శంగా నిలిచిన రాఘవేంద్ర
తలచుకుంటే సాధించలేనిది ఏమీ లేదని కర్నూలు జిల్లా బంటనహాలుకు చెందిన రాఘవేంద్ర నిరూపించారు.. ఉద్యోగంపై మక్కువతో చేరినా.. ఆ తర్వాత అతడిని నిలవనీయలేదు. ఏదో సాధించాలనే పట్టుదలతో బయటకు వచ్చేశారు. తనకున్న పొలంలో ఆధునిక పద్ధతుల్లో వ్యవసాయం చేశారు. మంచి ఫలితాలు సాధించి ఎందరికో ఆదర్శఃగా నిలిచారు.
కర్నూలు జిల్లా చిప్పగిరి మండలం బంటనహాలు గ్రామానికి చెందిన రాఘవేంద్ర బీఎస్సీ పూర్తి చేశారు. అందరిలాగానే అతనూ ఉద్యోగ వేటలో పడ్డారు. కానీ అనుకున్న ఉద్యోగం రాలేదు. చాలీచాలనీ జీతంతో అష్టకష్టాలు పడ్డారు.. ఇంటి బాడుగలు, భోజన ఖర్చులకే వచ్చే జీతం సరిపోయేది.చివరికి ఏదైనా సాధించాలని నిర్ణయించుకుని ఉద్యోగానికి రాజీనామా చేశారు. తనకున్న ఐదెకరాల పొలంలో వ్యవసాయం చేయాలని నిర్ణయించారు. వర్షాధారంపై పంట సాగు కత్తి మీద సాములాంటిదే. అయినప్పటికీ అతను ఏమాత్రం వెనకడుగు వేయలేదు.
• నీటిగుంతతో వ్యవసాయం
తన పొలంలో నీటిగుంతను రాఘవేంద్ర ఏర్పాటుచేసుకొన్నారు. ప్రభుత్వం నుంచి రాయితీపై ఆయిల్‌ ఇంజిన్‌ తీసుకున్నారు. నీటి కుంటలో ఉన్న నీటి ద్వారా వ్యవసాయం ప్రారంభించారు. మరోవైపు ఏబీసీ కాల్వ సమీపంలో ఉండడం.. ఆయకట్టు నుంచి వృథాగా వచ్చే నీటి తన నీటి కుంటకు వచ్చేలా ఏర్పాట్లు చేసుకున్నారు. తనకున్న ఐదెకరాల్లో ఉల్లి, మిరప, క్యాబేజీ, పప్పుశనగ, టమోటా సాగుచేశారు.
• అత్యుత్తమ దిగుబడులు
ఆధునిక పద్ధతుల్లో వ్యవసాయం చేయడంతో మంచి దిగుబడులు వచ్చాయి. ఎకరా ఉల్లి సాగుచేయగా 200 బస్తాల దిగుబడి వచ్చింది. తీవ్ర వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో జిల్లాలోని చాలా ప్రాంతాల్లో పప్పుశనగ దెబ్బతింది. చాలామంది రైతులు ఎకరాకు అర క్వింటా దిగుబడిని ఆశించారు. కానీ అతను మాత్రం 10 నుంచి 12 క్వింటాళ్లు పండించడం విశేషం.
* వ్యవసాయంలో అతను సాధించిన మెలకువలు, అనుభవాలను తెలుసుకునేందుకు జిల్లాలోని ఉన్నతాధికారులు, రైతు సంఘాల నాయకులు బంటనహాలుకు రావడం విశేషం.
• ఆధునిక పద్ధతులు అవసరం
- రాఘవేంద్ర, బంటనహాలు
చేసే పనిపై మనసు పెడితే సాధించలేనిది ఏమీలేదు. వ్యవసాయంలో మెలకువలు తెలుసుకోవడం, ఆధునిక పద్ధతులు పాటిస్తే ఉత్తమ ఫలితాలు సాధించవచ్చు. ఐదు రకాల పంటలు వేయడం వల్ల ఒక పంట దెబ్బతిన్నా మరో పంటలో మంచి దిగుబడి వస్తుంది. వ్యవసాయ అనుభవం ఉన్న రైతులను కలిసి మేలురకం విత్తనాలు, సేంద్రియ ఎరువులు వాడడం వల్ల మంచి లాభాలు వచ్చాయి.
....న్యూస్‌టుడే-బంటనహాలు (చిప్పగిరి)

No comments:

Post a Comment