యోగీశ్వరుడైన కృష్ణుడు ఆత్మారాముడై గోపికలతో రమించాడు.దీనినే 'మహారాసము 'అంటారు.
ఈ ఘట్టాన్ని నిర్వహించటంలో పోతన తన శక్తినంతటినీ వినియోగించాడు.
ఇక్కడ యోగమనగా జీవత్మ పరమాత్మల యొక్క సం యోగం.బాహ్య శృంగార క్రీడ కాదు.
ఆత్మారాముడంటే తనతో తానే రమించువాడని అర్ధం.గోపికలందరూ తన ఆత్మస్వరూపులుగానే భావించి తానే ఆనంద పడ్డాడని అర్ధం.
ఇది భగవంతునికి ఒక క్రీడ.భగవంతుని అంశలుగా పుట్టిన జీవులు తిరిగి భగవంతుని పొందుటకై పడే ఆరాటమే ఇక్కడ గోపికలలో కలిగే ఆర్తి రూపంలో వివరించబడింది.
కృష్ణావతారం కంసాది రాక్షసుల సం హారానికి మాత్రమే కాదు.ఎన్నోయుగాలలో తన భక్తులకు ఇచ్చిన వరాలను నిజం చేస్తూ వారికి తన ప్రేమరసాన్ని పంచిపెట్టటానికి అవతరించినది మాత్రమే.
"ప్రేమైవ గోపరామాణాం కామయిత్యగమత్ప్రధాం"గోపికల యొక్క పరాకాష్టకు చెందిన ప్రేమయే కామముగా లోకంలో ప్రచారం పొందినదని భావము.
నారదుడు గోపికల యొక్క భక్తియే అందరికంటే శ్రేష్టమైనదని ఉద్ఘాటించాడు.
యోగమాయతో కృష్ణుడు గోపికలతో రమణక్రీడకు ఉద్యుక్తుడైనాడు కాని కామదృష్టితోకాదు.దీనినే వ్యాసుడు వీక్ష్య రంతుం మనశ్చక్రే యోగమాయాముపాశ్రిత:అని చెప్పారు.
ఇక్కడ యోగమాయాముపాశ్రిత: అన్నదానికి వ్యాఖ్యాతలు వివిధరీతులలో చెప్పిన అర్ధాలు 100 వరకూ ఉన్నాయి.ఎవరూ కూడా గోపికలరతిని కామరతిగా చెప్పలేదు.
భార్యా,పుత్రులు దేహానికి సంబంధించినవారు.భగవంతుడు అంత:కరణానికి సంబంధించినటువంటివాడు.
ఆనదస్వరూపుడు,ఆనందాన్ని అందించేవాడు.ఆనందమునుండే భుత సృస్టి ఉద్భవించిందని ఉపనిషత్తులు చెబుతున్నాయి.
"ఆనందాత్థిఏవ ఖల్విమాని భూతాని జాయంతే"
అట్టి ఆనందాన్ని అందుకోవడమేప్రేమ భక్తి.అది గోపికల సొంతము.
"స్వాంగాలింగే రతిర్నస్యాత్,అంగనాలింగనే రతి:!యస్యాంగం జగదీశస్య తస్య రాగాదయ:కుత:" ప్రపంచమంతా తన శరీరమైనప్పుడు తనలో తానే తనతో తానే రమించటం జరుగుతుంది. కాబట్టి కాముకీ కాముక భావం సమన్వయ పడదు."కృష్ణం వందే జగద్గురుం"
ఈ ఘట్టాన్ని నిర్వహించటంలో పోతన తన శక్తినంతటినీ వినియోగించాడు.
ఇక్కడ యోగమనగా జీవత్మ పరమాత్మల యొక్క సం యోగం.బాహ్య శృంగార క్రీడ కాదు.
ఆత్మారాముడంటే తనతో తానే రమించువాడని అర్ధం.గోపికలందరూ తన ఆత్మస్వరూపులుగానే భావించి తానే ఆనంద పడ్డాడని అర్ధం.
ఇది భగవంతునికి ఒక క్రీడ.భగవంతుని అంశలుగా పుట్టిన జీవులు తిరిగి భగవంతుని పొందుటకై పడే ఆరాటమే ఇక్కడ గోపికలలో కలిగే ఆర్తి రూపంలో వివరించబడింది.
కృష్ణావతారం కంసాది రాక్షసుల సం హారానికి మాత్రమే కాదు.ఎన్నోయుగాలలో తన భక్తులకు ఇచ్చిన వరాలను నిజం చేస్తూ వారికి తన ప్రేమరసాన్ని పంచిపెట్టటానికి అవతరించినది మాత్రమే.
"ప్రేమైవ గోపరామాణాం కామయిత్యగమత్ప్రధాం"గోపికల యొక్క పరాకాష్టకు చెందిన ప్రేమయే కామముగా లోకంలో ప్రచారం పొందినదని భావము.
నారదుడు గోపికల యొక్క భక్తియే అందరికంటే శ్రేష్టమైనదని ఉద్ఘాటించాడు.
యోగమాయతో కృష్ణుడు గోపికలతో రమణక్రీడకు ఉద్యుక్తుడైనాడు కాని కామదృష్టితోకాదు.దీనినే వ్యాసుడు వీక్ష్య రంతుం మనశ్చక్రే యోగమాయాముపాశ్రిత:అని చెప్పారు.
ఇక్కడ యోగమాయాముపాశ్రిత: అన్నదానికి వ్యాఖ్యాతలు వివిధరీతులలో చెప్పిన అర్ధాలు 100 వరకూ ఉన్నాయి.ఎవరూ కూడా గోపికలరతిని కామరతిగా చెప్పలేదు.
భార్యా,పుత్రులు దేహానికి సంబంధించినవారు.భగవంతుడు అంత:కరణానికి సంబంధించినటువంటివాడు.
ఆనదస్వరూపుడు,ఆనందాన్ని అందించేవాడు.ఆనందమునుండే భుత సృస్టి ఉద్భవించిందని ఉపనిషత్తులు చెబుతున్నాయి.
"ఆనందాత్థిఏవ ఖల్విమాని భూతాని జాయంతే"
అట్టి ఆనందాన్ని అందుకోవడమేప్రేమ భక్తి.అది గోపికల సొంతము.
"స్వాంగాలింగే రతిర్నస్యాత్,అంగనాలింగనే రతి:!యస్యాంగం జగదీశస్య తస్య రాగాదయ:కుత:" ప్రపంచమంతా తన శరీరమైనప్పుడు తనలో తానే తనతో తానే రమించటం జరుగుతుంది. కాబట్టి కాముకీ కాముక భావం సమన్వయ పడదు."కృష్ణం వందే జగద్గురుం"
Songs from the divine trance of Jagadguruvulu Maharani Sanetha Maharajah vaaru
No comments:
Post a Comment