ఓ తండ్రి తన పిల్లల పాలిట కాలయముడయ్యాడు. స్కూలు ఫీజు కట్టే విషయంలో భార్యతో గొడవపడి కన్నబిడ్డల్ని చంపేశాడు. దారుణమైన ఈ ఘటన కర్నాటకలోని కేపీ అగ్రహారంలో జరిగింది.
ఆవారాగా తిరిగే శివకుమార్ తరచూ భార్య తాయమ్మతో గొడవ పడేవాడు. నిన్న పిల్లల స్కూలు ఫీజు కట్టనంటూ భార్యతో గొడవ పడ్డాడు. ఇళ్లలో పనిచేసే తాయమ్మ పనిలోకి వెళ్లగానే తమ ఇద్దరు బిడ్డలు 8 ఏళ్ల పవన్, 4 ఏళ్ల సించనలపై అమానుషంగా ప్రవర్తించి.. వాళ్లిద్దర్నీ కట్టేసి మరీ పొడిచి హత్య చేశాడు. అనంతరం గోనె సంచిలో కుక్కేసి పరారయ్యాడు. ఇంటికి వచ్చిన తాయమ్మ పిల్లలు కనిపించడం లేదని భర్తకు ఫోన్ చేసింది. అతని ఫోన్ స్విచ్చాఫ్ రావడంతో కంగారుపడి బంధువులకు సమాచారం ఇచ్చింది. ఈ క్రమంలో శివకుమార్ ఇద్దరు పిల్లల్ని హత్య చేసిన విషయం బయటపడింది. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు శివకుమార్ ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
No comments:
Post a Comment