UTILIZE THE BY IDENTIFYING THE HUMAN AS RARE IDENTITY GRANTED BY NATURE IN THE WITNESS

My PhotoMy Photo
Mother Late P.Rangaveni
Father: Late PGKsaibaba My younger brother (Late)
P.S.Bhanu Prasad


His Majestic Highness Jagadguruvulu Maharani Sametha Maharajah Shri Shri Shri Anjani Ravishankar Pilla vaaru
in the address of Hon. Chief Justice,
Supreme court of India,
New Delhi

Image may contain: text
జేబులో పెట్టుకొన్న ఫోన్ నుండి మాటలు వింటున్నారు కంప్యూటర్ ను హేక్ చేసి, ఈమైల్స్ అన్నీ చూస్తునారు, కంప్యూటర్ ముందు కుర్చుని ఎవరి ఏమి మాట్లాడుకొంటున్నా విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు అ విధంగా బౌతికంగా మేము బలం గా ఉన్నాము మేమే తెలివైన వారము మమ్ములను ఎవరూ ఏమి చెయ్య లేరు అన్నట్లు అలోచిస్త్రున్నారు, ఇందులో వ్యక్తులు కొందరు పోలీసులు మీడియా లో ఉన్న వారు కలసి గ్రూప్ గా ఫారం అయ్యి రహస్యం కులం కోసం డబ్బు కోసం సుఖాలు కోసం, రాజకీయంగా సామాజికంగా దెబ్బ కొడుతున్నారు ఎవరి మాటలు అయిన విని స్వార్ధానికి ఉపయోగించుకొంటున్నారు, రహస్య సేటిలైట్ కెమెరాలు ఉపయోగించుకొని మోసం చేస్తున్నారు.

Thursday, 25 February 2016


స్మృతి ఇరానీ ప్రసంగంలో ముఖ్యాంశాలివిగో........
*రోహిత్ వేముల ఆత్మహత్య..జవహర్ లాల్ యూనివర్శిటీలో విద్యార్థుల గొడవకు సంబంధించి ఆత్మరక్షణలో ఉన్నట్లుగా కనిపించిన కేంద్ర ప్రభుత్వం పార్లమెంటు వేదికగా గట్టి ఎదురుదాడి చేసింది.
*పై రెండు వివాదాలకు సంబందించి కేుంద్ర మానవ వనరుల మంత్రి స్మృతి ఇరానీ లోక్ సభలో నిన్న చేసిన ప్రసంగం అద్భుతం అని చెప్పాలి.
*భావోద్వేగాలతో కూడిన స్మృతి ప్రసంగంతో ప్రతిపక్షాలు బిక్కచచ్చిపోయాయనే చెప్పాలి.
*నిన్న సాయంత్రం ట్విట్టర్ సహా సామాజిక వేదికలన్నింట్లో.. వెబ్ మీడియాలో స్మృతి స్పీచే హాట్ టాపిక్ అయింది.
*పార్లమెంటులో ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ స్పీచెస్ అని కితాబిచ్చారు విశ్లేషకులు.
*ఐతే స్మృతి తనదైన శైలిలో అద్భుతంగా ప్రసంగిస్తుంటే కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ.. ఆ ప్రసంగం వినకుండా సభ నుంచి బయటికి వచ్చేసి, ప్రభుత్వం తనంటే భయపడుతోందని.. తనకు మాట్లాడే అవకాశం ఇవ్వట్లేదని వ్యాఖ్యానించడం గమనార్హం.
*తన ప్రసంగంలో స్మృతి.. రాహుల్ గాంధీని ఉతికారేశారు. ఆయన తీరును దుయ్యబట్టారు. రోహిత్ వేముల గురించి మాట్లాడేటపుడు తీవ్ర ఉద్వేగానికి గురైన స్మృతి ఉబికి వస్తున్న కన్నీరును ఆపుకుని ఆవేశంగా మాట్లాడారు. ఇంతకీ స్మృతి ప్రసంగం ఎలా సాగిందో చూద్దాం పదండి.
1) ‘‘మానవ వనరుల మంత్రిగా నా విధులను సక్రమంగా నిర్వర్తించాను. ఈ విషయంలో ఎవరికీ ఎలాంటి క్షమాపణలు చెప్పేది లేదు. అనేకమంది ఎంపీలు వివిధ అంశాలపై లేఖలు రాస్తుంటారు. వారి సమస్యల పరిష్కారానికి సంబంధిత అధికారులు, సంస్థలకు మా శాఖ లేఖలు రాస్తుంది. మీరందరి లేఖలపై చర్య తీసుకున్నందుకు నాపై ఆరోపణలు చేస్తారా? సెంట్రల్ స్కూళ్లలో సీట్లకోసం మీరు లేఖలు రాస్తే పని చేయలేదా?’’
2) ‘‘తెలంగాణ కోసం ఆ ప్రాంతంలో 600 మంది విద్యార్థులు ప్రాణత్యాగం చేశారు. ఎప్పుడైనా ఆ కుటుంబాల్ని పరామర్శించడానికి రాహుల్ గాంధీ వెళ్లాడా? కానీ హైదరాబాద్ వర్శిటీకి, జెఎన్‌యుకి రెండేసి సార్లు వెళ్లాడు. ఎందుకంటే ఇక్కడ అతడికి రాజకీయ అవకాశం లభించింది. దీన్ని సొమ్ము చేసుకుందామనిపించింది. అందుకే వెళ్లాడు’’
3) ‘‘ప్రతి సభ్యుడు చేసిన ఆరోపణకు నావద్ద సమాధానం ఉంది. మీరు ఓపికగా వింటే చాలు. విద్యారంగాన్ని రాజకీయం చేసి నాపై నిరాధార ఆరోపణలు చేశారు. ఇప్పుడు సమాధానమిస్తుంటే వెళ్లిపోతారా? విద్యుక్త ధర్మాన్ని నిర్వర్తిస్తే శిలువ ఎక్కిస్తారా?’’
4) ‘‘నా పేరు స్మృతి ఇరానీ. మీకు సవాల్ చేస్తున్నాను. నా కులమేంటో మీరు చెప్పగలరా? కులం, మతం పేరిట నేనెప్పుడూ పని చేయలేదు. జేఎన్‌యూ ఆవరణలో అవాంఛిత కార్యకలాపాలు జరగుతున్నాయని ఎప్పట్నుంచో చెబుతున్నా. అక్కడ ‘మహిషాసుర దినోత్సవం’ జరిపిన సంగతి మర్చిపోవద్దు. ఆ కార్యక్రమంలో దుర్గాదేవిని కించపరిచే విధంగా చిత్రీకరించారు. కావాలంటే దీనికి సంబంధించిన కరపత్రాలు చూడండి’’
5) ‘‘రోహిత్ ఆత్మహత్య గురించి తెలియగానే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఫోన్ చేశా. కానీ ఆయన తీరిక లేకుండా ఉన్నారనే సమాధానం వచ్చింది. కేసీఆర్ ఇంతవరకు అందుబాటులోకి రాలేదు. కేసీఆర్ కుమార్తె, ఎంపీ కవితకూ టెలిఫోన్ చేశాను. దీనికి సంబంధించిన కాల్ రికార్డ్స్ నా దగ్గర ఉన్నాయి.
6) రోహిత్ లేఖలో తన మరణానికి ఎవ్వరూ కారణం కాదని రాశాడు. ఐతే అతడి శవాన్ని ఈ నాయకులు రాజకీయం కోసం వాడుకున్నారు. జేఎన్‌యులో కవితా పఠనం కోసమని హాల్ తీసుకుని.. భారతదేశం ముర్దాబాద్, భారత సైన్యం ముర్దాబాద్, కాశ్మీర్‌కు స్వాతంత్రం కావాలి, భారతదేశాన్ని ముక్కలు చేస్తామంటూ నినాదాలిస్తే సహించాలా? వీల్లు అమాయక విద్యార్థులా? వీరిని వదిలి పెట్టాలా?’’

No comments:

Post a Comment